రీమేక్ కాదుగాని....!!

Update: 2017-07-25 12:00 GMT

రామ్ చరణ్, సుకుమార్ డైరెక్షన్ లో 'రంగస్థలం' చిత్రం షూటింగ్ తో బిజీగా వున్నాడు. రంగస్థలం చిత్రం ఫినిష్ కాగానే కొరటాల డైరెక్షన్ లో మరో మూవీ చేయనున్న రామ్ చరణ్, తన తదుపరి చిత్రాన్ని కూడా లైన్ లో పెడుతున్నట్లు వార్తలొస్తున్నాయి. 'నేను లోకల్' డైరెక్టర్ త్రినాథ రావు నక్కిన డైరెక్షన్ లో రామ్ చరణ్, కొరటాల తదుపరి చిత్రాన్ని చేస్తున్నాడని... త్రినాధరావు ఇప్పటికే స్క్రిప్ట్ పనుల్లో బిజీగా ఉన్నాడనే టాక్ నడుస్తుంది. అయితే త్రినాథ రావు ఈ చిత్రాన్ని చిరంజీవి గారి సూపర్ హిట్ సినిమా ఆధారంగా తెరకెక్కించబోతున్నట్లు ఫిలింనగర్ లో గుసగుసలు వినబడుతున్నాయి.

మెగాస్టార్ హిట్ చిత్రం ‘మంత్రిగారి వియ్యంకుడు’ ను బేస్ చేసుకుని ఈచిత్రాన్ని తెరకెక్కించబోతున్నట్లు టాక్ నడుస్తుంది. అయితే కేవలం ఆ సినిమాలోని కొన్ని ముఖ్యమైన అంశాలను మాత్రమే తీసుకుంటున్నారు గాని రీమేక్ మాత్రం చెయ్యరని కూడా చెబుతున్నారు. ప్రస్తుతం ఉన్న ట్రెండ్ కు తగ్గట్టు.... రామ్ చరణ్ ఇమేజ్ కు తగ్గట్టు ‘మంత్రిగారి వియ్యంకుడు' లోని కొన్ని కీలక విషయాల ప్రాతిపదికన త్రినాధరావు స్క్రిప్ట్ తయారుచేస్తున్నారని ప్రచారం జరుగుతుంది. అయితే ఈ విషయాన్ని మెగా ఫ్యామిలీ కన్ఫర్మ్ చేయాల్సి ఉంది.

ఇకపోతే రామ్ చరణ్ ప్రస్తుతం నటిస్తున్న 'రంగస్థలం' సినిమా వచ్చే సంక్రాతి కి విడుదల అవుతుందని అధికారిక ప్రకటన చేసినప్పటికీ ముందుగా ఈసినిమాని డిసెంబర్లోనే విడుదలకు సిద్ధం చేస్తున్నట్లు వార్తలొస్తున్నాయి.

Similar News