రామ్ చరణ్ చిత్రానికి కొత్త అతిథి!!

Update: 2017-02-28 12:32 GMT

రామ్ చరణ్, సుకుమార్ డైరెక్టన్ లో ఒక ప్రేమ కథా చిత్రాన్ని చెయ్యడానికి రెడీ అయిపోయాడు. ఇక అధికారికంగా ప్రారంభమైన ఈ చిత్రం కోసం రామ్ చరణ్ తన లుక్ ని పూర్తిగా మార్చేసాడని అంటున్నారు. ఇక 'ధ్రువ' కోసం పెంచిన కన్దలను కూడా కరిగించి సుకుమార్ చిత్రం కోసం రామ్ చరణ్ పర్ఫెక్ట్ గా రెడీ అయ్యాడని టాక్. పూర్తిగా విలేజ్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కే ఈ చిత్రంలో రామ్ చరణ్ కొత్తగా కనిపిస్తాడని చెబుతున్నారు. ఇక ఈ సినిమాలో అక్కినేని వారింటికి కాబోయే కోడలు సమంత మొదటిసారిగా రామ్ చరణ్ కి జోడిగా నటిస్తుంది. అయితే ఈ చిత్రానికి సంబందించిన మరో ఆసక్తికర వార్త ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో వినబడుతుంది.

అదేమిటంటే టాలీవుడ్ టాప్ డైరెక్టర్స్ లో ఒకరైన కోదండరామిరెడ్డి కొడుకు వైభవ్, రామ్ చరణ్ చిత్రంలో ఒక ముఖ్యమైన పాత్ర చేయబోతున్నాడని. మరి ఈ వార్త నిజమా లేక రూమరా అనేది తెలియాల్సి వుంది. ఇకపోతే ఇప్పటికే అల్లు అర్జున్ 'సరైనోడు'లో హీరో ఆదిని విలన్ గా చూపించి సక్సెస్ అయిన బోయపాటివలె.... సుకుమార్ కూడా వైభవ్ ని ఏ యాంగిల్ లో చూపిస్తాడో అనే క్యూరియాసిటీ ప్రతివక్కరిలో నెలకొంది. మరి వైభవ్ తమిళంలో వరుస ఆఫర్స్ తో బిజీగా వున్నాడు. వైభవ్ నిజంగా రామ్ చరణ్ చిత్రంలో గనక నటిస్తే అది ఈ చిత్రానికి ప్లస్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉందని అంటున్నారు.

అయితే ఈ వార్త నిజమే అయ్యి ఉంటుందని అంటున్నారు. ఎందుకంటే టాలీవుడ్ లో కోదండరామిరెడ్డి, మెగాస్టార్ చిరంజీవి లది సూపర్ హిట్ కాంబినేషన్ అవడంతో ఆ సాన్నిహిత్యంతోనే చరణ్ సినిమాలో వైభవ్ నటించే ఛాన్స్ ఎక్కువగా ఉందని అంటున్నారు.

Similar News