రాజీపడ్డ వెండితెర అందాల తార

Update: 2016-11-25 05:13 GMT

పాత తరంలో కథానాయికలు కేవలం అభినయంతోనే చిత్ర పరిశ్రమలోనూ, ప్రేక్షకుల మనసుల్లోనూ సుస్థిర స్థానాన్ని ఏర్పరచుకునేవారు. శ్రీదేవి కథానాయికగా రాజ్యం ఏలుతున్న కాలంలో ఇప్పుడు ఉన్నంత మీడియా ఉధృతం నాడు ఉండేది కాదు. ఇక సోషల్ మీడియా లాంటి పలు వేదికలు ఈ తరం వారికి సౌలభ్యంలో వున్నాయి తప్ప దశాబ్దం వెనక్కి వెళ్తే ఎక్కడా ఆ ఊసే కనిపించదు. పైగా నాటి తరం వారంతా పబ్లిసిటీ కన్నా ప్రతిభని నమ్ముకుని పరిశ్రమలో కొనసాగేవారు కాబట్టి ఇటువంటి ఆర్భాటాలు, పుకార్లు ఏమి లేకపోయినా వార్తల్లో పేరు వినపడకపోయినా ఎక్కువ కాలం ప్రేక్షకుల మదిలో అగ్ర తారల్లానే వెలుగొందేవారు. నేటి తరం కథానాయికలకు పోటీ అధికం అయిపోయింది. చేతి నిండా సినిమా అవకాశాలు వున్నా సోషల్ మీడియాలో వారి గురించిన చర్చ ఏదో ఒకటి జరుగుతుంటే తప్ప వారి ఉనికి కాపాడుకోవటం కష్టం అయిపోయింది.

ఈ తరుణంలో శ్రీదేవి తనయురాలు జాహ్నవి కపూర్ వెండి తెరకు పరిచయమయ్యే ఏర్పాట్లు జరుగుతుండగా జాహ్నవి గురించిన వ్యక్తిగత జీవితపు ప్రచారాలు అనేకం సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి. ఈ పరిణామాన్ని జీర్ణించుకోలేని నాటి తరం నటి శ్రీదేవి తన కూతురుకు చాలా నియమ నిబంధనలు పెట్టింది. వార్తల్లో నిలవటం కోసం వివాదాలు, ప్రేక్షకుల గుర్తింపు కోసం ప్రేమాయణాలు జోలికి వెళ్ళకూడదు అని షరతులు విధించింది అంట. కానీ చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టకముందే జాన్వీ తన తల్లి మాటను జమదాటినట్టు కనపడుతుంది. డియర్ జిందగీ చిత్ర స్క్రీనింగ్ కి హాజరు ఐన జాన్వీ కపూర్ తన ప్రియుడు శిఖర్ పహారియా తో కలిసి వచ్చింది. చివరకు శ్రీదేవి కూడా రాజీపడినట్టే అనుకోవాలి. ఎందుకంటే ఇదే స్క్రీనింగ్ కి శ్రీదేవి కుటుంబంతో పాటే హాజరు అయ్యాడు శిఖర్ పహారియా.

Similar News