రాజమండ్రి చేరుకుంటున్న అక్కినేని వారి కోడలు

Update: 2017-04-03 09:24 GMT

గత ఏడాది డిసెంబర్ నెలలో మెగా పవర్ స్టార్ నటించిన ధ్రువ చిత్రం ప్రేక్షకుల ముందుకి వచ్చిన నాటి నుంచి మెగా అభిమానులు అంతా రామ్ చరణ్ తేజ్ చేయబోయే తదుపరి చిత్రం ఎప్పుడు సెట్స్ పైకి వెళ్తుందా అని ఎదురు చూస్తున్నారు. మెగా ఫామిలీ కి చెందిన స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కి వెరైటీ లవ్ స్టోరీ తో ఆర్య వంటి మెమొరబుల్ సక్సెస్ ఇచ్చిన సుకుమార్ చెర్రీ తో ఎలాంటి వైవిధ్యమైన చిత్రం చేస్తాడో అని మెగా అభిమానులలో రోజు రోజుకి ఆతృత పెరిగిపోతుంది. అయితే వారి ఎదురు చూపులని పొడిగిస్తూ చెర్రీ సుకుమార్ చిత్రానికి సంబంధించిన చిత్రీకరణని నిర్ణీత షెడ్యూల్ సమయానికి కంటే చాలా ఆలస్యం చేసాడు.

ఎట్టకేలకు రెండు రోజుల క్రితం ఏప్రిల్ 1 నుంచి తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి నగర పరిసర ప్రాంతాలలో జరుగుతున్న చిత్రీకరణ లో పాల్గొంటున్నాడు రామ్ చరణ్ తేజ్. పీరియాడిక్ లవ్ డ్రామా గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో హీరో రామ్ చరణ్ తేజ్ వినికిడి సమస్య వున్న పాత్ర పోషిస్తున్నాడు. రామ్ చరణ్ తేజ్ కి జంటగా ఇప్పటికే సమంత ఖరారు కాగా, సుకుమార్ ముందుగా రామ్ చరణ్-సమంత ల మధ్య ఒక పాట ని తొలి షెడ్యూల్ లోనే చిత్రీకరించటానికి నిశ్చయించుకోవటంతో నేటి నుంచి సమంత కూడా రాజమండ్రిలోని చిత్ర బృందంతో సెట్స్ లో సందడి చేయనుంది. వీలైనంత త్వరగా చిత్రాన్ని పూర్తి చేసి ఇదే ఏడాది లో చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకి తీసుకు రావటానికి సన్నాహాలు చేస్తున్నారు చెర్రీ.

Similar News