రస్నాబేబీ పెళ్లిడేట్‌ ఫిక్సయింది...!

Update: 2016-03-04 13:49 GMT

మూడేళ్ల వయసులోనే ఐ లవ్‌ యు రస్నాగా యాడ్‌తో రస్నాబేబీగా పేరుతెచ్చుకున్న ముద్దుగుమ్మ అంకిత. ఆ తర్వాత ఆమె తెలుగులో 'లాహిరి లాహిరి లాహిరిలో...,సింహాద్రి, ధనలక్ష్మీ ఐ లవ్‌యు' వంటి పలు చిత్రాల్లో నటించింది. కాగా ఆమె ఎన్టీఆర్‌తో చేసిన 'సింహాద్రి' చిత్రం ఇండస్ట్రీ రికార్డులను తిరగరాయడంతో అప్పుడు ఆమెకు వరుస అవకాశాలు వచ్చాయి. అయినా ఆమె ఆ అవకాశాలను సద్వినియోగం చేసుకోలేకపోయింది. దర్శకత్వం చేయాలనే కోరికతో హాలీవుడ్‌ స్టూడియోలో ఫిలిం టెక్నాలజీ కోర్స్‌ చేసి అక్కడే పలువురు దర్శకుల వద్ద పనిచేసింది. ఆక్రమంలో న్యూజెర్సీకి చెందిన ఎన్నారై. జెపీ మోర్గాన్స్‌ సంస్థ వైస్‌ప్రెసిడెంట్‌ విశాల్‌ జగ్తాప్‌ను ప్రేమించింది. పెద్దలు ఓకే చెప్పడంతో గత ఏడది నవంబర్‌ 7న ముంబైలోని జేవీ మారియర్‌ హోటల్‌లో నిశ్చితార్థం జరిగింది. ఈనెల 28న ముంబైలో ఈ పెళ్లి అత్యంత వైభవంగా జరుగనుంది. పెళ్లి తర్వాత తన భర్తను నిర్మాతగా మార్చివేసి ఓ చిత్రానికి దర్శకత్వం చేసే ఆలోచనలో ఆమె ఉంది. మొత్తానికి జాక్‌పాట్‌ అంటే అంకితదే అని చెప్పుకోవాలేమో...!

Similar News