రవి తేజ అనుకున్నది ఒక్కటి జరిగింది ఒక్కటి!!

Update: 2018-02-03 07:45 GMT

రాజా ది గ్రేట్ సినిమా తర్వాత మాస్ మహా రాజా నటించిన చిత్రం టచ్ చేసి చూడు థియేటర్లలోకి వచ్చేసింది. రాశి ఖన్నా- సీరత్ కపూర్ లాంటి గ్లామర్ హీరోయిన్స్ నటించిన ఈ సినిమాకు కొత్త దర్శకుడు విక్రమ్ సిరికొండ డైరెక్ట్ చేసాడు. వక్కంతం వంశీ కథ అందించాడు.

నిన్న రిలీజ్ అయినా ఈ సినిమా ప్రేక్షకులని ఆకట్టుకోలేదనే చెప్పాలి. ఎందుకంటే ఈ సినిమాలో జనాలను ఆకట్టుకునే పాయింట్ ఒక్కటి కూడా లేకపోవడం అనే విషయం. మరి రెగ్యులర్ సినిమా కావడంతో చూసినా ప్రేక్షకుడు నిరాశగా బయటికి వస్తున్నాడు. ఈ సినిమా రిలీజ్ కి ముందు .. ప్రయోగాలు చేస్తే జనం చూడ్డంలేదు.. అవి ఆడ్డంలేదు.. నిర్మాతలకు డబ్బులు రావడం లేదు అంటూ చెప్పుకొచ్చాడు రవితేజ.

అందుకే రెగ్యులర్ సినిమాలు చేయాల్సి వస్తుందని చెప్పాడు రవి. మరి ఇప్పుడు టచ్ చేసి చూడు టాక్ విన్న తర్వాత.. రొటీన్ గా చేసినా కూడా జనాలు పట్టించుకోరని తెలుసుకుంటాడా అన్నదే ఆలోచించాల్సిన విషయం. మరి రెగ్యులర్ సినిమాను కూడా జనాలు తిప్పికొడితే రవి తేజ నెక్స్ట్ ఎటువంటి ఫార్ములా యూజ్ చేసి ఏం తీస్తాడో చూడాలి.

Similar News