రజిని ఇంకో సినిమా ఒకే చేశారు!!

Update: 2018-02-24 07:50 GMT

రజినికాంత్ పాలిటిక్స్ లోకి ఎంటర్ అయి సినిమాలు చేయడం మానలేదు అని స్పష్టమైంది. ప్రస్తుతం 'కాల'.. '2.0' రెండు సినిమాలు ఒకేసారి పోస్ట్ ప్రొడక్షన్ లో ఉన్న సంగతి తెలిసిందే. అయితే ముందుగా 'కాల' సినిమా ఏప్రిల్ 27న రాబోతుంది. ఇక 2.0 పోస్టుపోన్ అవుతూ అవుతూ..ఆగస్టుకు వెళ్ళింది. ఒకే ఏడాదిలో రజినివి రెండు సినిమాలు వచ్చి చాలా కాలం అయింది.

పాలిటిక్స్ లో బిజీ అవుతారనుకుంటే....

ఈ రెండు సినిమాలు తర్వాత రజిని పాలిటిక్స్ బిజీ అవుతారని అందరు అనుకున్నారు. సినిమాలు చేయడం మానేస్తారు అనుకున్నారు. ఆలా అనుకున్న వారంద్దరికి రజిని స్వీట్ షాక్ ఇచ్చారు. త్వరలోనే రజిని ఓ సినిమా చేయబోతున్నట్టు అధికారంగా సన్ పిక్చర్స్ నిర్మాణ సంస్థ ప్రకటన ఇచ్చింది. ఈ సినిమాకు వైవిధ్యమైన సినిమాల దర్శకుడిగా పేరున్న కార్తిక్ సుబ్బరాజ్ మొదటిసారి రజని సినిమా చేయబోతున్నాడు. గతంలో పిజ్జా..ఇరైవి వంటి సినిమాలు తీసాడు కార్తీక్. కళానిధి మారన్ నిర్మాతగా వ్యవహరించే ఈ సినిమా అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందనుందని తెలిసింది.

ఫ్యాన్స్ కు ఆనందమే.....

ఈ స్వీట్ న్యూస్ విన్న రజిని ఫ్యాన్స్ ఆనందానికి హద్దులు లేకుండా పోతున్నాయి. ఇలా వరసగా సినిమాలు మీద సినిమాలు చేయటంలో రజిని ఉదేశం ఏంటో కానీ తన ఫ్యాన్స్ మాత్రం తెగ ఆనంద పడిపోతున్నారు. రాజకీయాల్లో రజినీకి ప్రత్యర్థిగా కమల్ హాసన్ వచ్చి జనాలలోకి తనదైన స్థాయిలో దూసుకుపోతున్నాడు. మరి ఇది దృష్టిలో పెట్టుకునే కొత్త సినిమాకు ఓకే చెప్పాడా లేదా ముందే కమిట్ మెంట్ ఇచ్చినందు వలన సినిమా చేస్తున్నాడా అన్న దానిపై క్లారిటీ రావాల్సి ఉంది.

Similar News