ఈమధ్య సినిమాల్లో కన్న సోషల్ మీడియాలో ఎక్కువ పాపులర్ అవుతున్నారు హీరోయిన్స్. తమ ఫొటోస్ పెట్టి జనాలకి మరింత దగ్గర అవుతున్నారు. ఇలానే ఒక కన్నడ బ్యూటీ ఈ మధ్య సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది.
కన్నడంలో యూ టర్న్ అనే సినిమాతో శ్రద్దా శ్రీనాథ్ అనే యువ హీరోయిన్ ఎంటర్ అయింది. ఆమె ఆ సినిమాతో చాలా క్రేజ్ ఏర్పడింది. ఆ సినిమా తర్వాత కన్నడ.. తమిళ్ లో వరసపెట్టి అవకాశాలు అందుకుంటూ దూసుకుపోతుంది. అయితే ఆమెపై ఓ ప్రముఖ మ్యాగజైన్ కన్నేసింది. అంతే ఆమెతో ఓ ఫోటోషూట్ కూడా చేసి జే ఎఫ్ డబ్ల్యూ వారు కవర్ పేజ్ పై ప్రింట్ చేశారు. దింతో ఆమెకు క్రేజ్ ఏ స్థాయిలో పెరిగిందో అర్ధం చేసుకోవచ్చు.
ఈ మధ్యే తెలుగులో సినిమాలని ఒకే చేస్తుంది. నాగార్జున - నాని ముల్టీస్టార్ర్ర్ లో సినిమాలో నటించడానికి ఒకే చెప్పేసింది. నాగార్జున పక్కన నటించనుంది. అలానే హీరో ఆది సినిమాలో కూడా ఛాన్స్ కోటేసింది.