యమా జోరుమీదున్నాడుగా...!!

Update: 2017-06-17 13:30 GMT

కుర్ర హీరో సందీప్ కిషన్ వరుస సినిమాలతో ఫుల్ జోష్ లో వున్నాడు. ఈ ఏడాది 'నగరం' వంటి హిట్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సందీప్ కిషన్ ఇప్పుడు 'నక్షత్రం' చిత్రంతో అలరించడానికి సిద్ధమవుతున్నాడు. ఫైనాన్స్ ప్రాబ్లెమ్ వల్ల విడుదల ఇబ్బందులను ఎదుర్కుంటున్న 'నక్షత్రం' చిత్రం వచ్చే నెలలో విడుదల అవుతుందని సమాచారం. అయితే సందీప్ కిషన్ మాత్రం వరుస ఆఫర్స్ తో దూసుకుపోతున్నాడు. టాలీవుడ్ లోని ముగ్గురు కుర్ర హీరోలతో కలిసి 'శమంతకమణి'లో నటిస్తున్న సందీప్ సుశీంథిరన్ దర్శకత్వం లో 'C/O సూర్య' లో నటిస్తున్నాడు.

అలాగే సివి కుమార్ దర్శకత్వంలోని 'మాయావన్' చిత్రంలో నటిస్తున్న సందీప్. ఈ చిత్రం త్వరలోనే విడుదలకు సిద్ధమవుతోంది. చేతిలో మూడు సినిమాలతో బిజీగా వున్న సందీప్ కిషన్ ఇప్పుడు మరో చిత్రాన్ని ప్రారంభించే దిశగా అడుగులు వేస్తున్నాడట. ‘కిట్టు ఉన్నాడు జాగ్రత్త’ దర్శకుడు వంశి కృష్ణ దర్శకత్వంలో సందీప్ కిషన్ ఒక కొత్త చిత్రాన్ని ప్రారంభించబోతున్నాడట. ఈ నెలలోనే ఈ సినిమా ఓపెనింగ్ ఉన్నట్లు తెలుస్తుంది. అయితే ఈ చిత్రం కుటుంబ కథా చిత్రంగా ఉండబోతుందని అంటున్నారు.

Similar News