మ‌హేష్ కొత్త సినిమాలో రొమాన్స్ చేసేది ఈ సుంద‌రే

Update: 2018-01-03 04:54 GMT

టాలీవుడ్ ప్రిన్స్ మ‌హేష్‌బాబుకు గ‌తేడాది పూర్తిగా నిరాశ‌ప‌రిచింది. స్టార్ డైరెక్ట‌ర్ ఏఆర్‌.మురుగ‌దాస్ ద‌ర్శ‌క‌త్వంలో మ‌నోడు చేసిన స్పైడ‌ర్ సినిమా ఘోర‌మైన డిజాస్ట‌ర్ అయ్యింది. సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ డిజాస్ట‌ర్ సినిమాల్లో స్పైడ‌ర్‌కు చోటు ద‌క్క‌డంతో మ‌హేష్ మార్కెట్‌, క్రేజ్ చాలా డౌన్ అయ్యింది. ప్ర‌స్తుతం మ‌హేష్‌తో పాటు మ‌హేష్ ఫ్యాన్స్ ఆశ‌ల‌న్నీ కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో మ‌హేష్ న‌టిస్తోన్న భ‌ర‌త్ అను నేను సినిమాపైనే ఉన్నాయి.

వ‌చ్చే స‌మ్మ‌ర్ కానుక‌గా ఏప్రిల్ 27న ఈ సినిమాను రిలీజ్ చేసేందుకు స‌న్నాహాలు జ‌రుగుతున్నాయి. ఈ సినిమా త‌ర్వాత మ‌హేష్ కెరీర్‌లోనే ప్ర‌తిష్టాత్మ‌క‌మైన 25వ సినిమాగా తెర‌కెక్కుతోన్న సినిమాకు వంశీ పైడిప‌ల్లి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. టాలీవుడ్ అగ్ర నిర్మాత‌లు చ‌ల‌సాని అశ్వ‌నీద‌త్ - దిల్ రాజు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తోన్న సంగ‌తి తెలిసిందే. మ‌హేష్‌బాబు కెరీర్‌లోనే ఇప్ప‌టి వ‌ర‌కు రాని డిఫ‌రెంట్ జాన‌ర్‌లో ఈ సినిమా తెర‌కెక్కుతోన్న‌ట్టు తెలుస్తోంది.

వ‌చ్చే ఫిబ్ర‌వ‌రి నుంచి సెట్స్‌మీద‌కు వెళ్లే ఈ సినిమాలో హీరోయిన్‌గా పూజా హెగ్డేను ఎంపిక చేసిన‌ట్టు విశ్వ‌సనీయ వ‌ర్గాల స‌మాచారం. పూజా, ముకుంద‌తో పాటు గ‌తేడాది వ‌చ్చిన బ‌న్నీ డీజే సినిమాలో కూడా న‌టించింది. తాజాగా బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా శ్రీ వాసు దర్శకత్వంలో వ‌స్తోన్న సాక్ష్యంలో కూడా న‌టిస్తోంది. ఇక ఇప్పుడు ఏకంగా స్టార్ హీరో మ‌హేష్ ప‌క్క‌న సూప‌ర్ ఛాన్స్ కొట్టేసింది.

భారీ బ‌డ్జెట్‌తో తెర‌కెక్కే ఈ సినిమా ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి. అల్ల‌రి న‌రేష్ కూడా ఈ సినిమాలో ఓ ముఖ్య‌పాత్ర‌లో న‌టిస్తున్నాడు. త్వరలో ఈ సినిమాకు సంభందించిన నటీనటుల వివరాలు అధికారికంగా ప్రకటించబోతున్నారు చిత్ర యూనిట్. వ‌చ్చే ద‌స‌రాకు ఈ సినిమాను రిలీజ్ చేయ‌నున్నారు.

Similar News