మోడ్రెన్ కృష్ణుడు వచ్చేసాడు!!

Update: 2017-04-30 13:02 GMT

ఎన్టీఆర్ జై లవ కుశ షూటింగ్ లో బాగా బిజీగా వున్నాడు. కానీ బాహుబలి చిత్రం కోసం చిన్న బ్రేక్ ఇచ్చాడు. బాబీ డైరెక్షన్ లో కళ్యాణ్ రామ్ నిర్మాతగా భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న జై ల లవ కుశ లో ఎన్టీఆర్ నటిస్తూనే మరో పక్క నవరత్న తైలం యాడ్ షూట్ లో మెరిశాడు. నవరత్న తైలం ఆయిల్ కి ఎప్పటినుండో బ్రాండ్ అంబాసిడర్ గా పనిచేస్తున్న ఎన్టీఆర్ గతంలో తీసిన యాడ్ నే ఇంకా ఛానెల్స్ లో వెయ్యడంతో దాని మీదున్న క్రేజ్ తగ్గుతుందని భావించిన నవరత్న ఆయిల్ కంపెనీ వాళ్ళు మరో కొత్త యాడ్ ని చేశారు.

అయితే ఈ యాడ్ లో ఎన్టీఆర్ మోడరన్ కృష్ణుడిగా కనిపిస్తున్నాడు. ఇక ఈ యాడ్ లో ఎన్టీఆర్ 'కూల్ రాజా 'గా దర్శనం ఇవ్వడం నుంచి.. డ్యాన్స్ చేయడం.. పాట పాడడం వరకు అన్నిటీలో తన సత్తా చూపించేసాడు. ఇక ఈ యాడ్ లో విజువల్ ఎఫెక్ట్స్ సూపర్ గా వున్నాయి. అంటే ఈసారి కూల్ కృష్ణుడిగా ఎన్టీఆర్ అదరగొట్టేసాడన్నమాట. మన హీరోలు ఈ మధ్యన సినిమాలతో పాటే యాడ్ లకు బాగా ఇంపార్టెన్స్ ఇచ్చేసి చేతినిండా సంపాదించేస్తున్నారు.

Similar News