మొత్తానికి మెగాహీరోకు హీరోయిన్లు సెట్‌ అయ్యారు...!

Update: 2016-03-21 00:15 GMT

తాను నటించింది కొన్ని చిత్రాలే అయినా వాటి ద్వారా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్న మెగాహీరో వరుణ్‌తేజ్‌ తాజాగా శ్రీనువైట్ల దర్శకత్వంలో ఓ చిత్రం చేయనున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ చిత్రం ప్రీపోడక్షన్‌ పనులు వేగంగా జరుగుతున్నాయి. కాగా ఈచిత్రంలో స్టార్‌హీరోయిన్‌ రకుల్‌ప్రీత్‌సింగ్‌

నటిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. కానీ తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రంలో రకుల్‌ నటించడం లేదు. ఇందులో ఇద్దరు హీరోయిన్లకు అవకాశం ఉంది. మెయిన్‌ హీరోయిన్‌గా మంచి ఊపుమీదున్న లావణ్యత్రిపాఠిని ఎంపిక చేయగా, మరో హీరోయిన్‌గా 'అలా..ఎలా'తో టాలీవుడ్‌కు పరిచయమై, 'కుమారి 21ఎఫ్‌'తో మంచి ఇమేజ్‌ సంపాదించుకున్న హెబ్బాపటేల్‌ను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించనున్నారు. మొత్తానికి ఇద్దరు మంచి ఊపులో ఉన్న హీరోయిన్లను ఎంపిక చేయడం సినిమాకు పెద్ద ప్లస్‌ పాయింట్‌గా మారనుంది.

Similar News