మెగా ఫ్యామిలీపై ఎందుకంత పగ

Update: 2018-04-16 07:12 GMT

కత్తి మహేష్ అంటే ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు ఎక్కడైనా పసిపిల్లోణ్ణి అడిగినా చెప్పేస్తారు. మరి అంతలా పాపులర్ ఫిగేర్ అయ్యాడు కత్తి. ఛానల్స్ ఇచ్చిన ఓవరేక్షన్ తో కత్తి మహేష్ రెచ్చిపోతున్నాడు. కాకపోతే నిన్నమొన్నటివరకు కాస్త ఇంపార్టెన్స్ ఇచ్చిన వాళ్ళే ఈరోజు కత్తిని కడిగేస్తున్నారు. గతంలో పవన్ కళ్యాణ్ కి వ్యతిరేఖంగా పవన్ ఫ్యాన్స్ తో పెట్టుకుని బాగా హైలెట్ అయిన కత్తి మహేష్ .. పవన్ ఫ్యాన్స్ తో కాంప్రమైజ్ అయ్యి కామ్ అయ్యాడు. అయితే కత్తి మహేష్ పవన్ విషయంలో వెనక్కి తగ్గినా మెగా ఫ్యామిలీ మీద కత్తి కట్టినట్టుగా కనబడుతున్నాడు. మద్యమద్యలో పవన్ కళ్యాణ్ ని విమర్శిస్తూ హైలెట్ అవుతున్న కత్తి మహేష్ ఇప్పుడు ఒక నటి వల్ల మళ్ళీ లైవ్ లోకొచ్చాడు.

సునీతా అనే ఆర్టిస్ట్ కత్తి మహేష్ పక్కన ఉండగానే ఒక ఛానల్ సాక్షిగా తనకి అవకాశం ఇప్పిస్తానని చెప్పి తనని బలాత్కారం చేసాడని.. అలాగే డబ్బులు ఇచ్చి పంపేసాడని బహిరంగంగా ఆరోపణలు చేసింది. దెబ్బకి ఖంగు తిన్న కత్తి మహేష్ అబ్బే అదేం లేదు. సునీతతో పాత పరిచయం ఉంది. తాను ఒకసారి ఇంటికి వస్తే మాట్లాడి పంపేసాను.. అలాగే క్యాబ్ డ్రైవర్ కి డబ్బులిచ్చాను.. కావాలనే సునీత తన మీద ఆరోపణలు చేస్తుంది అన్నట్టుగా బిల్డప్ ఇచ్చాడు. మరి అలా చెప్పిన సునీత అనే నటి మాత్రం వెనక్కి తగ్గలేదు. తాను మహేష్ మీద పోలీస్ కంప్లైట్ ఇవ్వడానికి వెళ్ళినప్పుడు కత్తి, పవన్ కళ్యాణ్ ఇష్యులో ఉన్నాడని కేసు తీసుకోమని పోలీస్ లు చెప్పారని కూడా చెబుతుంది.

అయితే కత్తి మహేష్ ఇప్పుడు సునీత చేసిన ఆరోపణల మీద కోర్టుకి వెళ్లి ఆమె మీద పరువు నష్టం దావా వెయ్యబోతున్నట్టుగా.. ఇదంతా కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ వారే వెనకుండి నడిపిస్తున్నట్టుగా మహేష్ ఆరోపిస్తున్నాడు. సదరు మహిళపై 50 లక్షల పరువు నష్టం దావా వేస్తున్నట్లుగా ట్వీట్ చేసాడు. మరి ఈ విషయంలో సునీత తో పాటు మెగా ఫ్యామిలీ నిర్మాణ సంస్థపై కేసు వెయ్యడం చూస్తుంటే కత్తి మహేష్ మెగా ఫ్యామిలీపై కత్తి కట్టినట్టుగానే కనబడుతున్నాడు. అసలు కత్తి మహేష్ కి మెగా ఫ్యామిలీ మీద ఎందుకంత పగో అంటూ జనాలు సెటైర్స్ కూడా వేస్తున్నారు.

Similar News