మెగా ఫ్యామిలీ యంగ్ కపుల్స్ ఎక్కడున్నారో తెలుసా?

Update: 2017-10-31 08:40 GMT

ఒకపక్కన రంగస్థలం సినిమాతోనూ.. మరొపక్కన తన తండ్రి సై రా సినిమా నిర్మాణబాధ్యతలతోను ఫుల్ బిజీగా వున్నా రామ్ చరణ్ ప్రస్తుతానికి ఫ్యామిలీ ట్రిప్ లో సేద దీరుతున్నాడు. తన భార్య ఉపసన్ తో కలిసి ఈ వీకెండ్ ని చరణ్ బ్రహ్మాండంగా ప్లాన్ చేసుకున్నాడు. షూటింగ్స్‌‌తో తీరికలేకుండా ఉండే చరణ్.. ఇప్పుడు జడల బర్రెపై కూర్చుండగా.... భార్య ఉపాసన తాడు సాయంతో దానిని ముందుకు తీసుకెళ్లే ఆ సీన్ ఉంది చూడండి... ఈ ఫోటో చూసిన మెగా ఫాన్స్ మాత్రం అబ్బో మా స్టార్ చరణ్ తన వైఫ్ తో ఎంతో ప్రేమగా ఎంజాయ్ చేస్తున్నాడో అని మురిసిపోతున్నారు. అయితే చరణ్ ఇలా జడల బర్రెపై కూర్చుని... దాన్ని ఉపాసన తాడుతో పట్టుకున్న ఫొటోస్ ని ఉపాసన మెగా అభిమానుల కోసం సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.

ఇక ఈ ట్రిప్ లో ఆలు అర్జున్, అల్లు స్నేహ, అల్లు శిరీష్ కూడా ఉన్నట్లుగా తెలుస్తుంది. వీరంతా కలిసి ఫ్యామిలీ ట్రిప్ లో భాగంగా మనాలి వెళ్లినట్లుగా శిరీష్ ట్విట్టర్ లో పోస్ట్ చేసాడు. ఇక అక్కడ ఎత్తైన కొండల మీద ఈ జంటలతో పాటే శిరీష్ కూడా ఎంజాయ్ చేస్తున్నట్లుగా చెబుతున్నాడు. మొత్తం మీద మెగా ఫ్యామిలీ యంగ్ కపుల్స్ ఇలా షూటింగ్ కి కాస్త బ్రేక్ ఇచ్చి ఫ్యామిలీతో సంతోషంగా గడిపేస్తున్నారన్నమాట.

Similar News