మెగా ఫ్యాన్స్‌కు షాక్‌... రంగ‌స్థ‌లం షో క్యాన్సిల్‌

Update: 2018-03-30 16:56 GMT

మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్‌పై క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో తెర‌కెక్కిన రంగ‌స్థ‌లం సినిమా శుక్ర‌వారం ప్ర‌పంచ‌వ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ అయ్యింది. గ‌త యేడాదిన్న‌ర కాలంగా చెర్రీ అభిమానులు ఈ సినిమా కోసం ఎంతో ఆతృత‌తో వెయిట్ చేస్తున్నారు. సినిమాకు ఉద‌యం నుంచే మంచి టాక్ రావ‌డంతో థియేట‌ర్ల వ‌ద్ద క్యూలో నిల‌బ‌డి సినిమా టిక్కెట్ల‌ను ప‌ట్టేస్తున్నారు. ఇదిలా ఉంటే ఓ చోట రంగ‌స్థ‌లం షోలు క్యాన్సిల్ అవ్వ‌డంతో మెగా అభిమానులు నిరాశ‌తో షాక్ తిన్నాడు.

రంగ‌స్థ‌లం సినిమాను ఏపీలోని కృష్ణా జిల్లా నందిగామలోని మయూరి థియేటర్‌లో మాత్రం మధ్యలోనే నిలిపివేశారు. ఈ థియేట‌ర్ యాజ‌మాన్యం టిక్కెట్ రేటును మామూలు రేటు క‌న్నా ఎక్కువ రేటుకు అమ్ముతున్న‌ట్టు అభిమానులు ఆరోపించారు. ఈ క్ర‌మంలోనే మెగా అభిమానుల‌కు, థియేట‌ర్ యాజ‌మాన్యానికి గొడ‌వ జ‌ర‌గ‌డంతో చివ‌ర‌కు ప్రేక్ష‌కులు, మెగా అభిమానులు క‌లిసి దీనిపై జిల్లా క‌లెక్ట‌ర్‌కు ఫిర్యాదు చేవారు.

థియేట‌ర్ బుకింగ్‌లో ఒక్కో టిక్కెట్ మామూలు రేటు క‌న్నా రూ 100, రూ 150లకు అమ్ముతున్నారని వీరు క‌లెక్ట‌ర్‌కు ఫిర్యాదు చేశారు. వెంట‌నే స్పందించిన జిల్లా క‌లెక్ట‌ర్ త‌హ‌సిల్దార్‌ను థియేట‌ర్ వ‌ద్ద‌కు పంపారు. థియేట‌ర్ వ‌ద్ద‌కు చేరుకున్న క‌లెక్ట‌ర్ విచారణ పేరుతో చిత్ర ప్రదర్శనను మధ్యలో నిలిపివేశారు. దీంతో థియేటర్ లోని అభిమానులు ఆగ్రహాహంతో ఆందోళ‌న‌కు దిగారు. చివ‌ర‌కు పోలీసులు రంగ‌ప్ర‌వేశం చేసి ప‌రిస్థితి అందుబాటులోకి తెచ్చారు.

Similar News