మెగా ఫామిలీ కాదు.. మహేష్ అభిమానిని

Update: 2016-12-20 05:26 GMT

తెలుగు చిత్ర పరిశ్రమలో గత రెండున్నర్ర దశాబ్దాలుగా అగ్ర స్థానంలో గట్టి పోటీ ఇస్తున్నది మెగా స్టార్ చిరంజీవి, తరువాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. దశాబ్దాలు మారుతున్న తరుణంలో ప్రత్యర్ధులు మారుతున్నారు కానీ మెగా ఫామిలీ మాత్రం మారటం లేదు. నాటి తరంలో మెగా స్టార్ చిరంజీవి ఒంటరి పోరాటంతో నెగ్గుకొస్తే ఇప్పుడు మెగా ఫామిలీ ని టాప్ రేస్ లో ఉంచటానికి చాలా పెద్ద జాబితానే వుంది. చిరంజీవితో పాటు పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్, రామ్ చరణ్ తేజ్, అల్లు శిరీష్, సాయి ధరమ్ తేజ్, వరుణ్ తేజ్ ఇలా సీనియర్ మోస్ట్ హీరో నుంచి నేటి తరాన్ని ఆకర్షించే చరిష్మా వున్న కుర్ర హీరోల వరకు అందరూ వున్నారు మెగా ఫామిలీ లో. అందుకే కథానాయికలు గుర్తింపు పెంచుకోవటానికి ఒక్క మెగా హీరో తో కలిసి నటిస్తే చాలు అనుకుంటారు.

ఆలా ఎలా, కుమారి 21 ఎఫ్, ఇదో రకం ఆడో రకం, ఎక్కడికి పోతావు చిన్నవాడా, నాన్న నేను నా బాయ్ ఫ్రెండ్స్ ఇలా వరుసగా విజయవంతమైన సినిమాలలో నటిస్తూ గోల్డెన్ లెగ్ పేరు కైవసం చేసుకోవాటినికి అతి చేరువలో వుంది హెబ్బా పటేల్. హెబ్బా తొలి నుంచి తనకి మెగా ఫామిలీ హీరోలతో నటించాలని వుంది అంటూ పలు స్టేట్మెంట్లు ఇచ్చింది. తరువాత అమ్మడికి వరుణ్ తేజ్ నటిస్తున్న మిస్టర్ చిత్రంలో అవకాశం దక్కింది. దీనితో మెగా అభిమానుల దృష్టిలో పడిపోయినట్టే అని భావించిందో ఏమో... ఇప్పుడు అభిమాన హీరో ఎవరు అని అడిగితే తడబడకుండా మహేష్ బాబు అని చెప్తూ ఆయనతో నటించే అవకాశం కోసం ఎదురు చూస్తున్నాను అని సెలవిస్తోంది. మెగా అభిమానుల బ్లెస్సింగ్స్ తో పాటు సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానుల ప్రోత్సాహం ఉంటే దాదాపు సినిమా ప్రేక్షకుల అందరి తోడ్పాటు వున్నట్టే అని గ్రహించినట్టుంది హెబ్బా. అయితే మెగా హీరో తో ఆది పాడే అవకాశం దొరికినంత సులువుగా అమ్మడికి మహేష్ సరసన అవకాశం దొరుకుతుందా అనేది ప్రశ్నర్ధకం.

Similar News