మిల్కీ బ్యూటీకి ఇంత కాలానికి బుద్ది వచ్చినట్టుంది

Update: 2018-01-02 05:12 GMT

దక్షిణాది చిత్ర పరిశ్రమలో వరుస సినిమా షూటింగ్స్ తో బిజీ గా సాగుతున్న కెరీర్ ని ఒకటికి రెండు సార్లు చేజేతులారా ఇరకాటంలో పెట్టుకుని తగిన మూల్యం చెల్లించుకుంది మిల్కీ బ్యూటీ తమన్నా. దక్షిణాది అగ్ర కథానాయకులు ఐన మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, అజిత్, సూర్య, అల్లు అర్జున్, తారక్, ప్రభాస్, రామ్ చరణ్ తేజ్ వంటి స్టార్ హీరోస్ సరసన నటిస్తూ కెరీర్ పీక్ దశలో ఉండగా బాలీవుడ్ నుంచి పిలుపు రావటంతో తనకంటే ముందు ఇలియానా వేసిన తప్పటడుగులనే బాటగా తీసుకుని బొంబాయి కి మకాం మార్చి కెరీర్ని క్లిష్ట దశలోకి నెట్టుకుంది తమన్నా. హిమ్మత్వాలా అంటూ గతంలో శ్రీదేవి కి బాలీవుడ్ లో స్టార్ స్టేటస్ తెచ్చిన చిత్ర రీమేక్ కావటంతో ఆశపడి ఆ పాత్రలో నటించిన మిల్కీ బ్యూటీ కి ఆ చిత్ర ఘోర పరాజయం తీవ్ర నిరాశనే మిగిల్చింది. కానీ వెనువెంటనే మరో అగ్ర కథానాయకుడు సైఫ్ అలీ ఖాన్ సరసన హమ్ షకల్స్ లో నటించినప్పటికీ విజయం వరించకపోవటంతో తమన్నా కి ఉత్తరాదిన ఆదరణ కరువై అవకాశాల కొదవ ఏర్పడింది.

అప్పటికే తమన్నా వదిలి వెళ్లిన గ్యాప్ ని తెలుగులో రకుల్, రాశి ఖన్నా వంటి భామలు ఫిల్ చేస్తుండటంతో దిక్కు తోచని స్థితిలో వున్న తమన్నా కి బాహుబలి రూపంలో ఒక సదావకాశం లభించింది. బాహుబలి ప్రపంచవ్యాప్తంగా ఘన విజయం సాధించినప్పటికీ దక్షిణాదిన తమన్నా కి అవకాశాలు పెరగలేదు. కానీ మరోసారి బొంబాయి నుంచి జాన్ అబ్రహం చిత్రంలో కథానాయిక గా అవకాశం పలుకరించింది. ఇప్పటికే బాలీవుడ్ ని నమ్ముకుని నష్టపోయిన తమన్నా ఆలస్యం అయినా దక్షిణాది చిత్రాలకే సంతకం చేయాలనే ఉద్దేశం తో జాన్ అబ్రహం చిత్ర అవకాశాన్ని తిరస్కరించింది. ప్రస్తుతం దక్షిణాది భామల మధ్య కొనసాగుతున్న పోటీలో మిల్కీ బ్యూటీ ఫామ్ పుంజుకునే స్థాయిలో ఏ చిత్రం పడుతుందో చూడాలి.

Similar News