మహేష్ విజయవాడ నుండి హైదరాబాద్ కి షిఫ్ట్ అయ్యాడు

Update: 2018-03-28 08:50 GMT

ఈ సమ్మర్ లో వచ్చే పెద్ద చిత్రాలలో 'భరత్ అనే నేను' కూడా ఒక్కటి. ఈ సినిమా వచ్చేనెలలో రిలీజ్ కు రెడీ అవుతుంది. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్ అండ్ ఫస్ట్ సాంగ్ రికార్డ్స్ ని క్రియేట్ చేస్తుంది. ఇక ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ వైజాగ్ నుండి విజయవాడకి..విజయవాడ నుండి హైదరాబాద్ కు మారింది.

విజయవాడలో ఈ ఈవెంట్ చేస్తే రాజకీయ వివాదాలు తలెత్తవచ్చని చిత్ర యూనిట్ తో పాటు మహేష్ బాబు భావించి ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. సహజంగానే రాజకీయాలకు దూరంగా ఉండే మహేష్..తన చిత్రం కొత్త రాజకీయ దుమారానికి కేంద్రం కాకూడదని స్వయంగా మహేషే నిర్మాతలకి చెప్పాడంట.అందుకే విజయవాడ నుండి హైదరాబాద్ కి ప్రీ రిలీజ్ ఈవెంట్ మారిందట. అటు బావ గల్లా కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది.

గుంటూరు దగ్గరలో పవన్ కళ్యాణ్ 'జనసేన' ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జరిపిన చోటే ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా జరపాలని తొలుత నిర్మాతలు భావించారు. అందుకు కావాల్సిన అనుమతులు కూడా తీసుకున్నారట నిర్మాతలు. కానీ ఇప్పుడు వెనక్కు తగ్గి ఈ ఈవెంట్ హైదరాబాద్ లో గ్రాండ్ గా జరపనున్నారు.

Similar News