మళ్లీ ఆ హీరొయిన్ నే కావాలంటున్న మాస్ మహారాజ్!

Update: 2016-03-30 15:17 GMT

మాస్ మహరాజా రవితేజ ఇప్పుడు కొత్త సినిమా స్టార్ట్ చేసేస్తున్నాడు. బెంగాల్ టైగర్ సూపర్ హిట్ గా నిలిచినా.. కొత్త మూవీ స్టార్ట్ చేయడంలో ఆలస్యం చేశాడు రవితేజ. ఇప్పుడు చక్రి అనే కొత్త డైరెక్టర్ తో మూవీ కన్ఫాం అయింది. ప్రస్తుతం రవితేజ సరసన హీరోయిన్‌ను ఫైనలైజ్ చేసే పనిలో ఉన్నాడు దర్శకుడు. బెంగాల్ టైగర్‌లో రాశీఖన్నాతో ఆడిపాడిన రవితేజ.. మరోసారి ఆ భామనే ఎంచుకుంటున్నట్లు తెలుస్తోంది. నిజానికి ఈ మూవీలో అమీ జాక్సన్ ను నటింపచేసేందుకు గట్టిగానే ప్రయత్నించాడు డైరెక్టర్. ఈ ఆఫర్ విషయంలో అమీ నుంచి రెస్పాన్స్ సానుకూలంగానే ఉన్నా... ఈ పాత్రకు రాశిఖన్నా అయితే కరెక్ట్ అని భావించాడట మాస్ మహరాజ్. అందుకే వరుసగా రెండోసారి తన సినిమాలో రాశికి ఆఫర్ ఫిక్స్ చేశాడు రవితేజ. యాక్షన్ ఓరియెంటెడ్ గా సాగే ఈ మూవీలో.. స్టోరీ చాలా వేగంగా సాగుతుంది. ఈ పాత్రకు రాశిఖన్నా సరిగ్గా సరిపోతుంది. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ చివరి దశలో ఉంది. ఫైనల్ బౌండ్ స్క్రిప్ట్ రెడీ కాగానే.. సినిమాని స్టార్ట్ చేస్తాం. మే నెల చివర్లో ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుంద'ని యూనిట్ వర్గాలు అంటున్నాయి.

Similar News