మళ్లీ అమ్మడి వయసు ఇరవైల్లోకి వెళ్ళిపోయినట్టుందే

Update: 2017-02-16 06:23 GMT

తెలుగు లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన బద్రి, సూపర్ స్టార్ మహేష్ బాబు సరసన నాని, నట సింహం నందమూరి బాల కృష్ణ సరసన పరమ వీర చక్ర, యంగ్ టైగర్ తారక్ సరసన నరసింహుడు చిత్రాలలో నటించిన బాలీవుడ్ అందాల భామ అమీషా పటేల్ తరువాత తెలుగులో చిత్రాలు చేయకపోవటానికి వరుసగా వచ్చిన మూడు డిజాస్టర్స్ కారణం. తెలుగులో నటించిన నాలుగు చిత్రాలు రెప్యుటేడ్ స్టార్ హీరోస్ తోనే నటించినా బద్రి తరువాత చేసిన మూడు చిత్రాలు ఘోర పరాజయాలు చవిచూశాయి. ఒక సినిమాకి మరొక సినిమాకి బాగా గ్యాప్ తీసుకుని తెలుగులో ప్రయత్నాలు చేసినా అదృష్టం కలిసి రాలేదు అమీషాకి. నాటి నుంచి కేవలం బొంబాయి కి పరిమితమైపోయింది.

వయసు మీదపడటంతో యువ కథానాయికల పోటీని తట్టుకోవటం బాగా కష్టమైపోతుంది అమీషా పటేల్ కి. మధ్యలో కొంత కాలం సినిమాలకి గ్యాప్ ఇవ్వటంతో అమీషా ఇక నటనకి స్వస్తి పలికిందని భావించారంతా. కానీ అమీషా తన సెకండ్ ఇన్నింగ్స్ లో భైయ్యాజీ సూపర్ హిట్, దేశీ మేజిక్ అంటూ మళ్లీ బాలీవుడ్ ప్రేక్షకులని పలకరించబోతోంది. అలానే భారీ పారితోషికం అందుకుని ఆకతాయి అనే తెలుగు సినిమాలో ప్రత్యేక గీతంలో మెరవనుంది. నలభైలలో పడ్డ హీరోయిన్ కి అంత పారితోషికం చెల్లించి ప్రత్యేక గీతం చేపించుకోవటం ఎందుకని ఆశ్చర్యపోయినా ఇది మాత్రం నిజం. అలా నిర్మాత అమీషా పటేల్ కి అధిక మొత్తం చెల్లించటానికి ఒక కారణం వుంది. బాలీవుడ్ లో తన బౌన్స్ బ్యాక్ యంగ్ భామలకు కూడా చెమటలు పట్టించాలని బలంగా ఫిక్స్ ఐన అమీషా తన బాడీ షేప్ లను తిరిగి తన టీనేజ్ రోజులకి తీసుకు వెళ్లిపోయింది. తాజాగా అంతర్జాలంలో వైరల్ ఐన అమ్మడి మేకప్ రూమ్ ఫోటో ఇందుకు నిదర్శనం.

Similar News