మళ్లీ అదే హీరోయిన్ తో పూరీ

Update: 2016-11-14 16:42 GMT

పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ప్రభాస్ నటించిన ఏక్ నిరంజన్ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం ఐన బాలీవుడ్ కథానాయిక కంగనా రనౌత్. ఆ చిత్ర విడుదల సమయంలో అంటే కంగనాకు పరిచయం అవసరం కానీ ఇప్పుడు కంగనా రనౌత్ గురించి తెలియని సినిమా ప్రేక్షకుడు వుండరు. కంగనా నటించిన క్వీన్ వంటి లేడీ ఓరియెంటెడ్ చిత్రం సృష్టించిన సంచలన విజయ ప్రకంపనలు అవి. కాబట్టి సహజంగానే అందరి భామల్లా క్వీన్ విడుదల తరువాత బాలీవుడ్ లో కెరీర్ పీక్ స్టేజ్ చూస్తుంది కంగనా రనౌత్. మరి ఇటువంటి సమయంలో ఆంగ్ల చిత్రాల అవకాశాలు తలుపు తడితే తీస్తుంది కానీ తెలుగు చిత్ర అవకాశాలకు స్పందిస్తుందా అని అందరి సందేహం. అందుకే ఇప్పటి వరకు ఏ తెలుగు దర్శక నిర్మాతలు ఆవిడని సంప్రదించకపోయి ఉండొచ్చు.

గత ఏడాది ఫిబ్రవరిలో విడుదల ఐన టెంపర్ చిత్రం తరువాత పూరి జగన్నాథ దర్శకత్వం వహించిన మూడు చిత్రాలు జ్యోతి లక్ష్మి, లోఫర్, ఇజమ్ ఆశించిన స్థాయి ఫలితాలు ఇవ్వలేకపోయాయి. తాజాగా తారక్ మళ్లీ పూరికి డేట్స్ ఇస్తున్నాడని వార్తలు వచ్చినా అటువంటిది ఏమి ఇంతవరకు జరగలేదు. అందుకే పూరి ఈ సారి సినిమా వీలైనంత త్వరగా చుట్టేసి విడుదల చెయ్యటం కాకుండా నాణ్యమైన కథను చెప్పే ప్రయత్నం చెయ్యటానికి పూనుకున్నాడని వినికిడి. ఒక లేడీ ఓరియెంటెడ్ కథని ఇప్పటికే సిద్ధం చేసాడు అంట. ఈ కథని కంగనా రనౌత్ కి వినిపించాలని యోచిస్తున్నట్టు సమాచారం. గతంలో ఒకసారి పూరి తో పని చేసింది కాబట్టి అది పెద్ద కష్టమేమి కాదు. కాకపోతే జ్యోతి లక్ష్మి వంటి లేడీ ఓరియెంటెడ్ కథని పూర్తి స్థాయిలో తీర్చిదిద్దలేక ఫెయిల్ ఐన పూరి ఈ సారి కంగనా ని ఒప్పించటానికి కథకు ఎం హంగులు జోడించాడో మరి.

ఈ లేడీ ఓరియెంటెడ్ కథ గురించి పూరి జగన్నాథ్ అధికారిక ప్రకటన ఏమి చెయ్యలేదు. మొత్తం ప్రీ ప్రొడక్షన్ పనులు అయిపోయిన తరువాత ప్రకటిస్తాడా లేక ఇంకా తారక్ డేట్స్ ఇస్తాడు అని ఆశపడుతున్నాడా అనేది పూరీకే తెలియాలి.

Similar News