మరోసారి జార్జియా వెళ్లనున్న వరుణ్ తేజ్!!

Update: 2018-02-24 14:00 GMT

మొదటి సినిమాతోనే డిఫరెంట్ సబ్జెక్టు తో తెలుగు ప్రేక్షక హృదయాలని గెలుచుకున్నాడు డైరెక్టర్ సంకల్స్ రెడ్డి. సబ్ మెరైన్ లో సాగే తొలి సినిమాగా ఘాజీ ప్రత్యేక గుర్తింపు దక్కించుకుంది. ఈ మూవీలో ముఖ్యంగా అందరిని ఆకట్టుకుంది సబ్ మెరైన్ సెట్. ఒరిజినల్ కి ఏ మాత్రం తీసిపోకుండా ఆ సెట్ వేసి సక్సెస్ అయ్యాడు సంకల్స్ రెడ్డి.

స్సేస్ స్టేషన్ సెట్ తో....

ఇక రెండో సినిమా కూడా డిఫరెంట్ జోనర్ ని సెలెక్ట్ చేసుకున్నాడు సంకల్స్. అయితే ఈసారి అంతరిక్షంలో సాగే కథతో సినిమా తెరకెక్కించబోతున్నాడు. 'ఫిదా'.. 'తొలిప్రేమ' వరస హిట్స్ తో దూసుకుపోతున్న వరుణ్ తేజ్ ఈ సినిమాలో హీరోగా చేస్తున్నాడు. ఈ సినిమా కోసం జార్జియా దేశంలో స్పేస్ స్టేషన్ సెట్ వేస్తున్నారు. ఆల్రెడీ ఒక్క టీం ఈ సెట్ వేసే పనిలో ఉన్నారు. 'ఘాజీ' లాగే ఈ సినిమాలో కూడా సెట్ చాలా కీలకం కానుంది. అందుకోసం సంకల్స్ ప్రత్యేకంగా చాలా జాగ్రత్తలే తీసుకుంటున్నారు. వరుణ్ తేజ్ 'కంచె' సినిమా కూడా జార్జియా లోనే తీశారు. మళ్లీ ఇప్పుడు రెండో సారి వరుణ్ జార్జియా వెళ్లనున్నారు. సెంటిమెంట్ పరంగా చూసుకుంటే ఇది వరుణ్ కు కలిసొచ్చే అంశమే అనుకోవచ్చు.

Similar News