మరో సీక్రెట్ మ్యారేజ్ కి రంగం సిద్దమైందా?

Update: 2018-01-05 07:56 GMT

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శర్మ, భరత్ క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీలు ఎన్నో ఏళ్ళ నుండి ప్రేమించుకుంటున్నారనే విషయం మొత్తం ప్రపంచానికే తెలుసు. వారు ఎంత ప్రేమికులైనప్పటికీ మధ్యలో వారి మధ్యన విభేదాలు తలెత్తినట్టు కూడా వార్తలొచ్చాయి. అసలీ విరాట్, అనుష్కలు కలిసి ఎక్కడ చూసినా సందడి చేసేవారు కానీ... ఎప్పుడు తమ ప్రేమ గురించిన విషయాలేమి ఎప్పుడు బహిరంగ పరిచేవారు కాదు. అలాగే చెప్పాపెట్టకుండా సీక్రెట్ గా పెళ్ళి చేసుకుని సోషల్ మీడియాలో ఆఫీషియల్ గా తమ పెళ్లి ఫొటోలతో షాక్ ఇచ్చారు. ఇక తర్వాత అందరికి తెలిసేలా రిసెప్షన్స్ కూడా ఏర్పాటు చేశారు అది వేరే విషయం.

అయితే ఇలాంటి జంట బాలీవుడ్ లో మరొకటి ఉంది. వారెవరో ఈపాటికే మీకు అర్ధమై ఉంటుంది. వారే దీపికా పదుకొనె, రణ్వీర్ సింగ్ ల జంట. వీరిద్దరూ కూడా ఎప్పటినుండో ప్రేమలో మునిగి తేలుతున్నారు. కానీ పెళ్లి పేరు మాత్రం ఎత్తడం లేదు. వీరి మధ్యన కొన్నిసార్లు విభేదాలు తలెత్తినట్టుగా వార్తలొచ్చాయి కూడా. కానీ వీరు మాత్రం బాగా క్లోజ్ గానే మూవ్ అవుతున్నారు. ఒకరింటికి ఒకరెళ్ళడం.. కలిసి ఫంక్షన్స్ కి, పార్టీలకు హాజరు కావడం ఇలా అన్ని చోట్ల ఈ జంట సందడి చెప్పక్కర్లేదు. అయితే పెళ్లి విషయంలో నోరుమెదపని వీరు సీక్రెట్ గా ఈరోజు శుక్రవారం శ్రీలంక లో ఎంగేజ్మెంట్ చేసుకోబోతున్నట్టుగా వార్తలొస్తున్నాయి.

జనవరి ఐదున దీపికా పదుకొనె పుట్టిన రోజు సందర్భంగా రణ్వీర్, దీపికాలు నిశ్చితార్థంలో ఒక్కటి కాబోతున్నారని.. అంటున్నారు. ఇక రణ్వీర్ సింగ్ షూటింగ్ నిమిత్తం శ్రీలంక లో ఉండగా... అక్కడ నిశ్చితార్ధం కోసమే దీపిక కూడా శ్రీలంక బయలు దేరేందుకు ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకున్నట్లుగా చెబుతున్నారు. ఇప్పటికే ఇరు కుటుంబాల వారు గుట్టుచప్పుడు కాకుండా శ్రీలంక చేరుకున్నారని టాక్ మాత్రం నేషన్ మీడియాలో హైలెట్ అయ్యింది. ఇలా సెలెబ్రిటీస్ అంతా తమ పెళ్లి విషయంలో ఇంతగా సీక్రెట్ మైంటైన్ చెయ్యాల్సిన అవసరం ఏముందో మాత్రం ఎవ్వరికి అంతు చిక్కని ప్రశ్నగా మిగిలిపోతుంది.

Similar News