మంచు విష్ణు సినిమా కష్టాలు!!

మంచు విష్ణు మోహన్ బాబు కొడుకుగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చినప్పటికీ… మధ్యలో కాస్త హీరోగా నిలబడి తర్వాత మాత్రం వరస వైఫల్యాలతో కొన్నాళ్ళు ఇండస్ట్రీలో కనబడలేదు. అయితే [more]

Update: 2020-03-29 07:20 GMT

మంచు విష్ణు మోహన్ బాబు కొడుకుగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చినప్పటికీ… మధ్యలో కాస్త హీరోగా నిలబడి తర్వాత మాత్రం వరస వైఫల్యాలతో కొన్నాళ్ళు ఇండస్ట్రీలో కనబడలేదు. అయితే ఓటర్ సినిమాతో నానా హడావిడి చేసి డైరెక్టర్ ని కూడా బెదిరించాడు అనే ఆరోపణలు ఎదుర్కున్న మంచు విష్ణు మోసగాళ్లు సినిమాతో త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్ కి ఎహెచ్చిన ఇంటర్వ్యూ లో మంచు విష్ణు తన సినిమా కష్టాలను ఏకరువు పెట్టాడు. తననుండి సహాయం పొందినవారు… తర్వాత తనని చాలా లైట్ తీస్కున్నారని, నేను చేసిన సహాయాన్ని వాళ్ళు మరిచిపోయారని చెబుతున్నాడు.

తన సహాయం పొంది ఆ విషయాన్నీ మరిచిపోయిన వారిలో చాలామంది సినీ దర్శకులు, ఆర్టిస్ట్ లు ఉన్నారని, కానీ వాళ్ళు నా సహాయం మరిచిపోయినా తనకేం బాధలేదని, అలాంటివాళ్ళు మళ్ళీ నా సహాయం కోసం ఎదురు చూసారని చెబుతున్నాడు. అసలు అలాంటి వాళ్లకి మీరు సహాయం ఎందుకు చేస్తారని నా భర్య అంటూ ఉంటుంది అని… కానీ నేను మాత్రం వాళ్ళు నా సహాయం కోసం నిలబడితే మల్లి సహాయం చేస్తుంటా అని చెప్పడమే కాదు.. ఆచారి అమెరికా యాత్ర సినిమా పోతుంది అని ముందే దర్శకుడు నాగేశ్వర రెడ్డికి చెప్పినట్లుగా మంచు విష్ణు చెబుతున్నాడు. ఆ సినిమా షూటింగ్ అమెరికా లో జరిగేటప్పుడే నాకు అర్ధం అయ్యింది. ఈ సినిమా ఆడదని, మీరు చెప్పిన కథకి తీసే కథకి పొంతన లేదు. షూటింగ్ ఆపేసి మల్లి టెస్ట్ చేసుకుని షూట్ చేద్దామంటే ఆయన వినలేదు.

అలాగే చాలా ఖర్చు పెట్టి ఓ సాంగ్ చేద్దాం అంటే వేస్ట్ అని నేను చెప్పిన దర్శకుడు నాగేశ్వర్ రెడ్డి వినకుండా ఆ సాంగ్ చేసారని.. కానీ ఆ సాంగ్ సినిమాలో లేకుండా చేసారని, ఎడిటింగ్ విషయంలోనూ నా సలహాలు పాటించలేదు. ఇక ఈ సినిమా ఆడదని చెప్పినా వినకుండా విడుదల చేసారని… చివరికి నేను చెప్పినట్టుగానే ఆ సినిమా అట్టర్ ప్లాప్ అయ్యింది అని మంచు విష్ణు తన సినిమా కష్టాలను ఏకరువుపెడుతున్నాడు.

Tags:    

Similar News