భలే సెటైర్స్ వేశాడే?

Update: 2017-11-17 07:00 GMT

తాజాగా విడుదల చేసిన నంది అవార్డ్స్ అనౌన్స్ మెంట్ మీద వచ్చినన్ని విమర్శలు ఎప్పుడూ రాలేదు. ఈ నంది అవార్డ్స్ లో కావాలనే మెగా ఫామిలీని పక్కన పెట్టారని మెగా క్యాంపులోని బండ్ల గణేష్, బన్నీ వాసు బహిరంగంగానే వాళ్ల అభిప్రాయాలని బయట పెట్టారు. ఇక డైరెక్టర్ గుణ శేఖర్ కూడా ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వాన్ని ప్రేశ్నిస్తు ఒక ప్రెస్ నోట్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసాడు.

సెటైరికల్ గా...

సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా వుండే రామ్ గోపాల్ వర్మ కూడా ఈ నంది అవార్డ్స్ పై తనదైన శైలిలో విమర్శిచాడు. ''నాకు తెలిసి ఇలా ఏమాత్రం 1% పక్షపాతం లేకుండా కేవలం మెరిట్ మీద మాత్రమే అవార్డ్స్ ఇచ్చిన కమిటీ మొత్తం ప్రపంచంలోనే ఉండి ఉండదు. ఇంత అద్భుతమైన నిజాయతీ గల నంది అవార్డు కమిటీకి ఖచ్చితంగా ఆస్కార్ అవార్డు ఇవ్వాలి. వావ్ నంది అవార్డ్స్ కమిటి మెంబర్లూ ఐ వాంట్ టు టచ్ ఆల్ యువర్ ఫీట్' అంటూ సెటైరికల్ గా సోషల్ మీడియాలో పోస్ట్ చేసాడు.

ఇంకా కెలికాడు....

ఇంతటితో ఆగకుండా డైరెక్టర్ బోయపాటి శ్రీను పై కూడా తనదైన మార్క్ పంచెస్ వేసాడు. ‘నిజానికి జేమ్స్ కెమరూన్ గాని లెజెండ్ చూస్తే టైటానిక్ కి తన కొచ్చిన 11 ఆస్కార్ అవార్డుల్ని బోయపాటి శ్రీను కాళ్ళ దగ్గర పెట్టి సాష్టాంగ నమస్కారం పెడతాడని' అని పంచ్ వేసాడు. అసలే అవార్డులపై విమర్శలు వస్తున్న తరుణంలో ఆర్.జి.వి. తన పోస్టులతో దానిని మరికాస్త కెలికినట్లయింది.

Similar News