బాలీవుడ్ లో తాప్సీకి క్రేజీ ప్రాజెక్ట్!

Update: 2017-11-04 14:00 GMT

టాలీవుడ్ పై నోరు పారేసుకుంటూ బాలీవుడ్ లో సెటిల్ అయింది తాప్సీ పన్ను. బాలీవుడ్ లో 'పింక్' మూవీతో తెగ గుర్తింపు తెచ్చేసుకుంది ఈ అమ్మడు. టాలీవుడ్ లో కూడా 'ఆనందో బ్రహ్మ' అంటూ మంచి హిట్ నే అందుకుంది. అటు బాలీవుడ్ లో ఇటు టాలీవుడ్ లో ఫుల్ బిజీ అయిపోయింది ఈ మిల్క్ బ్యూటీ.

అయితే ఇప్పుడు తాప్సీ పై ఓ న్యూస్ మీడియా లో ప్రముఖంగా వినపడుతుంది. ఇప్పటికే జూడ్వా 2 తో అందాల ఆరబోతతో బికినీ షో చేసిన ఈ భామను అనురాగ్ కశ్యప్ దర్శకత్వంలో రూపొందనున్న లేటెస్ట్ మూవీ కోసం సంప్రదించారట. ఇప్పటి వరకూ తను స్టార్ అనిపించుకోలేకపోయానంటూ ఈ మధ్యనే అసహనం వెళ్లగక్కిన ఈ భామకు ఇది మంచి అవకాశమే అని చెప్పవొచ్చు.

నిజానికి ఈ పాత్రను మొదట దంగల్ భామ సాన్యా మల్హోత్రాకు ఆఫర్ చేశారు.. కానీ కొన్ని కారణాల వల్ల ఈ ప్రాజెక్ట్ తాప్సీ పన్ను ముంగిట వాలిందని తెలుస్తోంది. అటు స్టోరీ పై.. డేట్స్ పై డిస్కషన్స్ కూడా జరిగిందని సమాచారం. డిసెంబర్ లో షూటింగ్ ప్రారంభించేందుకు ఏర్పాట్లు జరుగుతుండగా.. మరి కొన్ని రోజుల్లోనే ఈ ప్రాజెక్టులోకి తాప్సీ ఎంట్రీపై అఫీషియల్ అనౌన్స్ మెంట్ వచ్చే అవకాశం ఉంది అంటున్నారు.

Similar News