బాలయ్య-గుణశేఖర్ లకు పడదా?

Update: 2017-11-19 05:04 GMT

డైరెక్టర్ గుణశేఖర్ కు బాలయ్య కు పడట్లేదని ఇప్పుడు సోషల్ మీడియా హాట్ టాపిక్ అయింది. జ్యురిలో బాలయ్య ఉన్నాడు కాబట్టే రుద్రమదేవికి అన్యాయం జరిగిందంటున్నారు చాలామంది నెటిజన్లు. ఈ నేపథ్యంలో గతంలో బాలయ్య, గుణశేఖర్ ఒకే స్టేజ్ మీద ఉన్న ఓ వీడియో వైరల్ అవుతోంది.

వాస్తవానికి ఈ వీడియో 7నెలల కిందటిది. టీఎస్ఆర్ అవార్డుల వేడుకలో గుణశేఖర్ కు బాలయ్య శాలువా కప్పే విధానం చూస్తేనే అతడిపై బాలయ్యకు ఎంత కోపం ఉందో అర్థమౌతుందంటున్నారు. గుణశేఖర్ ను గౌరవించాల్సిన బాలయ్య... శాలువా కప్పుతున్నట్టే కప్పి మొహం పై విరిసికోట్టాడు. దీంతో స్టేజి మీద వున్న వాళ్లంతా అవాక్కయ్యారు.

రుద్రమదేవి సినిమాకు గాను ఉత్తమ దర్శకుడిగా గుణశేఖర్ అవార్డు అందుకున్న సందర్భమది. అయితే ఇప్పుడు కూడా బాలయ్య, గుణశేఖర్ కి నంది అవార్డు రాకుండా అడ్డు పడ్డాడని సోషల్ మీడియా లో జోరుగా ప్రచారం జరుగుతుంది. నంది అవార్డుల రచ్చ కారణంగా మరోసారి ఆ వీడియో క్లిప్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది.

Similar News