బాబాయిని వదిలేసి పవర్ స్టార్ ని నమ్ముకున్న కళ్యాణ్ రామ్

Update: 2018-01-08 05:42 GMT

గత ఏడాది తన నిర్మాణంలో తెరకెక్కిన జై లవకుశ చిత్రం విడుదలైన అనంతరం తాను నటించే చిత్రాలపై ఫోకస్ పెంచి శరవేగంగా షూటింగ్స్ పూర్తి చేయటానికి శ్రమిస్తున్నారు నందమూరి కళ్యాణ్ రామ్. ప్రస్తుతం ఆయన హీరోగా నటిస్తున్న రెండు ప్రాజెక్ట్స్ సెట్స్ లో రెగ్యులర్ షూటింగ్స్ జరుపుకుంటుండటం విశేషం. కాజల్ అగర్వాల్ కథానాయికగా నటిస్తున్న ఎం.ఎల్.ఏ ఒక చిత్రం కాగా, మరో చిత్రం 180 ఫేమ్ జయేంద్ర దర్శకత్వంలో తమన్నా కథానాయికగా నటిస్తున్న చిత్రం. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ లాస్ట్ షెడ్యూల్ కి చేరుకోవటంతో ఇప్పటి నుంచి సినిమా ప్రొమోషన్స్ పై దృష్టి సారిస్తున్నారు కళ్యాణ్ రామ్.

కళ్యాణ్ రామ్-తమన్నా జంటగా నటిస్తున్న చిత్ర టైటిల్ ని నేడు అనౌన్స్ చేసి, టీజర్ ని సంక్రాంతి పండుగకి థియేటర్స్ లో ప్రదర్శితమయ్యేలా ప్రణాళిక రచించుకున్నారట నిర్మాత. కాగా ఈ పండుగకి తన బాబాయ్ నటించిన జై సింహ చిత్రం విడుదల అవుతుండగా కళ్యాణ్ రామ్ మాత్రం తన చిత్ర టీజర్ ప్రమోషన్ కి అజ్ఞ్యాతవాసి ని నమ్ముకున్నాడు. అజ్ఞ్యాతవాసి సినిమాతో తన టీజర్ జోడించి ప్రేక్షకులలో తన సినిమా బజ్ ఏర్పడే విధంగా అడుగులు వేస్తున్నాడు కళ్యాణ్ రామ్. ఓవర్ సీస్ తోపాటు చాలా ప్రాంతాలలో జై సింహ కంటే అజ్ఞ్యాతవాసి కి ఎక్కువ క్రేజ్ ఉండటంతో కళ్యాణ్ రామ్ ఈ నిర్ణయం తీసుకుని ఉండొచ్చు. మరి అజ్ఞ్యాతవాసి విడుదల సమయానికి కళ్యాణ్ రామ్ టీజర్ సిద్దమవుతుందో లేదో చూడాలి.

Similar News