ప్రొమోషన్స్ విషయంలో మహేష్ కొత్త ప్లాన్

Update: 2018-03-13 08:23 GMT

సినిమా మీద బజ్ తీసుకుని రావాలంటే ఆ సినిమాకు ప్రొమోషన్స్ చాలా అవసరం. మన హీరోస్ కూడా ఇప్పుడు ప్రొమోషన్స్ విషయంలో ఏమాత్రం తగ్గట్లేదు. ముఖ్యంగా సూపర్ స్టార్ మహేష్ బాబు తానే స్వయంగా ప్రొమోషన్స్ చేసుకుంటూ ఉంటాడు. అయితే మహేష్ ఈసారి తన సినిమాకు సరికొత్త ప్రణాళికలను సిద్ధం చేసుకుంటున్నాడు.

స్పైడర్..బ్రహ్మోత్సవం డిజాస్టర్స్ అవ్వటంతో భరత్ అనే నేను సినిమాతో నష్టాలను రికవర్ చేయాలని అనుకుంటున్నాడు. ఆల్రెడీ ఈ సినిమాపై మార్కెట్ లో చెప్పలేనంత క్రేజ్ వుంది. మహేష్ - కొరటాల కాంబినేషన్ సినిమా కాబట్టి ప్రేక్షకులలో ఈ సినిమాపై అంచనాలు బాగానే వున్నాయి. ప్రస్తుతం షూటింగ్ లో బిజీగా వున్నా మహేష్ ఈసారి తన సోషల్ మీడియా టీమ్ ను కూడా మార్చేసినట్లు తెలుస్తోంది. సినిమా స్థాయిని పెంచేలా వర్క్ చేసే వారిని ఎంచుకున్నాడాట.

ఇకపోతే ఆ 20 రోజుల్లో సినిమాకు సంబంధించిన ఎదో ఒక విషయాన్ని ప్రేక్షకులకు తెలిసేలా ప్లాన్స్ రెడీ అవుతున్నాయట. నిర్మాతలు కూడా ప్రొమోషన్స్ విషయం తగ్గట్లేదు అని తెలుస్తుంది. ఇంటర్వూస్.. ప్రెస్ మీట్స్ ఇవన్నీ కామన్. అయితే ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్లస్ పాయింట్. అందుకు తగ్గట్టు భారీగా ప్లాన్ చేస్తున్నట్లు టాక్. కానీ ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎప్పుడన్నది తెలియాల్సివుంది . మరి ఈ సినిమా ఏ స్థాయిలో విజయాన్ని అందుకుంటుందో చూద్దాం.

Similar News