ప్రేమరూట్‌లోనే : పెళ్లి పీటలెక్కుతున్న మరో హీరో

Update: 2016-11-09 14:31 GMT

సినిమా పరిశ్రమలో ప్రేమ- పెళ్లిళ్ళు తెగ జరిగిపోతున్నాయి. ఒకప్పుడు పెద్దలు కుదిర్చిన పెళ్లి ళ్లు మాత్రమే చేసుకునేవారు. కానీ ఈ తరం హీరోలు మాత్రం ప్రేమ పెళ్లిళ్లకే తమ ఓటు వేస్తున్నారు. ఈ తరం హీరోల్లో అల్లు అర్జున్ స్నేహని ప్రేమించి పెళ్లాడాడు. ఇక చరణ్ కూడా ఉపాసనని ప్రేమ పెళ్లి చేసుకున్నాడు. మోహన్ బాబు కుమారులిద్దరూ ప్రేమ పెళ్లిళ్లు చేసుకున్నారు. ఇక అక్కినేని వారసులు కూడా ఇప్పుడు లవ్ మేరేజెస్ కి సై అంటున్నారు. . తాజాగా టాలీవుడ్‌లో మ‌రో హీరో కూడా ప్రేమలో పడినట్లుగా వార్తలు వస్తున్నాయి. ఈ విషయంపై విపరీతంగా రూమర్లు వినిపిస్తున్నాయి. టాలీవుడ్ యంగ్ హీరో శ‌ర్వానంద్ ప్రేమలో ఉన్నాడని పరిశ్రమలో బాగా టాక్ నడుస్తుంది. విషయంలోకి వెళ్తే.. హీరో శర్వానంద్, రామ్ చ‌ర‌ణ్ భార్య ఉపాస‌న క‌జిన్‌ని ప్రేమించి పెళ్లి చేసుకోబోతున్నాడ‌న్నట్లుగా గాసిబ్స్ వినిపిస్తున్నాయి.

కాగా రామ‌చర‌ణ్‌, శ‌ర్వానంద్ మంచి మిత్రులు. అలా ఉపాస‌న క‌జిన్, శ‌ర్వాకి మంచి దోస్త్‌ అయినట్లుగా వినికిడి. వీళ్లంతా కలిసి మెలిసి చాలా ఫ్యామిలీ ఫ్రెండ్స్ లా ఉంటారు. ఈ విషయంలో శర్వానంద్ కి, ఇక రామ్ చరణ్ మద్దతు కూడా గట్టిగా ఉండటంతో గట్టిగానే ఆ దిశగా ట్రయ్ చేస్తున్నట్లు తెలుస్తుంది. వీరిద్దరూ తోడల్లుళ్ళు అయ్యే అవకాశాలే ఎక్కువ కనపడుతున్నట్లు తెలుస్తుంది. ఇంకాస్త అడ్వాన్స్ గా కూడా వచ్చేసి రాబోవు ఏడాదిలో వీరిద్దరూ పెళ్ళి కూడా చేసుకోబోతున్నారంటూ వార్తలు వస్తున్నాయి. కానీ ఇవన్నీ పుకార్లే అంటూ శర్వానంద్ సన్నిహుతులు చెప్పినా, నిప్పులేనిదే పొగరాదుగా అంటున్నారు. ఇక మరో హీరో నితిన్ కూడా ప్రేమ పెళ్లి చేసుకోబోతున్నట్లు వార్తలొస్తున్నాయి. ఏది ఏమైనా ఈ తరం హీరోలు ప్రేమ పెళ్లిళ్లకే సై అంటున్నారనేది వాస్తవం.

Similar News