ప్రత్యేక హోదా గురించి మరోసారి స్పందించిన యంగ్ హీరో

Update: 2018-03-27 10:00 GMT

ఆమధ్య హీరో నిఖిల్ ప్రత్యేక హోదా విషయంలో ఆంధ్రప్రదేశ్ కు జరుగుతున్న అన్యాయం గురించి చేసిన ట్వీట్ పై మరోసారి క్లారిటీ ఇచ్చాడు. కిర్రాక్ పార్టీ ప్రొమోషన్స్ కోసం అమరావతికి వెళ్ళాను అక్కడ నిర్మాణాలు చూసి అసలు ఇది 25 లేదా 30 ఏళ్ళలో పూర్తవుతుందా అనిపించింది. కనీసం నా జీవితం అయిపోయేలోపైనా చూస్తానా అన్న అనుమానం కలిగింది.

సెంట్రల్ గవర్నమెంట్ ప్రత్యేక హోదాకి బదులు ప్యాకేజీ ఇచ్చే ఆలోచనలో ఉన్నప్పుడు నేను ఆ ట్వీట్ చేసానని చెప్పాడు హీరో నిఖిల్. నేను చేసిన ట్వీట్ వల్ల ఏదో మార్పు జరుగుతుందని కాదు కానీ ఓ మనిషిగా అది నా కనీస బాధ్యతగా భావించాను. గతంలో స్పెషల్ స్టేటస్ కోసం ట్వీట్ చేసినప్పుడు ఇండస్ట్రీ నుండి వార్ణింగ్స్ వచ్చాయని.. ఇండస్ట్రీ పెద్దలు నిఖిల్ కు ఫోన్ చేసి ఇలాంటి ఇష్యూస్ జోలికి వెళ్ళకని హెచ్చరించారని పలు వార్తలు వచ్చాయి. అయితే అవన్నీ అబద్దాలేనని ఖండించాడు. ఆ ట్వీట్ చేసినప్పుడు ఇండస్ట్రీ నుండి నాకు ఒక్క ఫోన్ కూడా రాలేదని క్లారిటీ ఇచ్చేసాడు.

మరోపక్క నిఖిల్ ఈ ప్రత్యేక హోదా నినాదాన్ని తన సినిమా కిరాక్ పార్టీ ప్రమోషన్ కోసమే వాడుకున్నాడు అనే కామెంట్స్ అప్పట్లోనే వినిపించాయి. దానిపై కూడా క్లారిటీ ఇచ్చాడు నిఖిల్. సక్సెస్ టూర్ లో ఉన్నప్పుడు మీడియా ఆడుగుతున్న ప్రశ్నలకు బాధ్యతగా బదులు ఇస్తున్నాను తప్ప.. సినిమా ప్రొమోషన్స్ కోసం ప్రత్యేక హోదాని వాడుకునే పరిస్థితిలో తాను లేనని నిఖిల్ స్పష్టం చేసాడు.

Similar News