పూర్ ప్రమోషన్‌తో బాలీవుడ్ బాద్షా చిత్రం

Update: 2016-11-25 07:31 GMT

బాలీవుడ్ లో ఖాన్ ల త్రయం ఇప్పుడు రాజ్యం ఏలుతున్నప్పటికీ ఆమిర్ ఖాన్, సల్మాన్ ఖాన్ లకన్నా ముందు నుంచే భారత దేశంతో పాటు విదేశీ మార్కెట్లోనూ భారీ క్రేజ్ సంపాదించుకున్న నటుడు షారుఖ్ ఖాన్. బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ తరువాత బాలీవుడ్ బాద్షా గా ఎదిగిన ఏకైక హీరో కూడా షారుకే. ఇదంతా గతం. ప్రస్తుత సినిమా వ్యాపారంలో వరుస వైవిధ్య కథలు చేస్తున్నప్పటికీ ఆమిర్ ఖాన్ కమర్షియల్ హీరోగానూ నిలదొక్కుకునే అవకాశం తన ప్రతి ప్రయత్నంతో దక్కుతుండగా, సల్మాన్ ఖాన్ కూడా షారుఖ్ ఖాన్ మార్కెట్ ని అధిగమించేసి షారుఖ్ ని వెనుకంజలోకి నెట్టేశాడు.

హ్యాపీ న్యూ ఇయర్, దిల్ వాలే, ఫ్యాన్ వంటి వరుస పరాజయాలతో కంగుతిన్న షారుఖ్ ఖాన్ కి మరీ ముఖ్యంగా ఫ్యాన్ చిత్ర వసూళ్లు గుండె దడను తెప్పించాయి. ప్రపంచవ్యాప్తంగా గ్రాస్ కూడా వంద కోట్ల రూపాయలకు చేరకపోవడం షారుఖ్ ఖాన్ ఈ మధ్య సినిమాల్లో ఇదే తొలి సారి. ఆ ప్రభావం ఇప్పుడు షారుఖ్ చిత్రాలపై కనిపిస్తుంది. ఆయన నటించిన డియర్ జిందగీ చిత్రం నేడు ప్రపంచవ్యాప్తంగా విడుదల అవుతుండగా ఈ చిత్రం గురించి సగటు ప్రేక్షకుడికి అవగాహన కూడా కరువు ఐయ్యింది. అనూహ్యంగా డియర్ జిందగీ విజయం సాధిస్తే తప్ప బాలీవుడ్ బాద్షా కి పూర్వ వైభవం రాదు ఏమో. అందుకే షారుఖ్ ఖాన్ కి డియర్ జిందగీ ఫలితం కీలకం కానుంది. అతి తక్కువ ప్రచారం తో విడుదల అవుతుండటం, పైగా సామాన్యుల దగ్గర కరెన్సీ విస్తృతంగా అందుబాటులోకి రాకపోవటంతో ఈ చిత్రానికి ఓపెనింగ్స్ తగ్గే ప్రమాదం కూడా వుంది.

Similar News