పారితోషికం లో ఇప్పటికి కూడా ఐష్ నెం.1

Update: 2018-01-06 06:29 GMT

దక్షిణాది భామలు ఇక్కడ కొద్దిగా ఫేమ్ రాగానే బాలీవుడ్ లో అవకాశాల కోసం తాపత్రయ పడుతుంటారు. అలాంటిది దక్షిణాది రాష్ట్రాలకు చెందిన ఒక భామ అతి పిన్న వయసులో బాలీవుడ్ కి వెళ్లి అగ్ర కథానాయిక హోదా అనుభవించి, తాను దక్షిణాది అమ్మాయి అని ప్రేక్షకులే మర్చిపోయే విధంగా ఎదగటం అంటే సామాన్యమైన విజయం కాదు. ఐశ్వర్య రాయ్ బచ్చన్ బెంగుళూరు అమ్మాయి అయినప్పటికీ బొంబాయి లో అగ్ర స్థానంలో దాదాపు రెండు దశాబ్దాల పాటు రాజ్యమేలింది.

వివాహానికి ముందు అత్యధిక పారితోషికం అందుకునే కథానాయికగా నిలిచినా ఐష్, ప్రస్తుతం 44 సంవత్సరాల వయసులో కూడా ఒక చిత్రానికి పది కోట్ల రూపాయల పారితోషికం అందుకుంటూ చరిత్ర సృష్టిస్తుంది. జజ్బా తో సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన ఐష్, ప్రస్తుతం ఫాన్నే ఖాన్ అనే చిత్రంతో పాటు మరో థ్రిల్లర్ చిత్రంలో కూడా ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఈ చిత్రాలు పూర్తికాగానే ఐష్ ఓల్డ్ హిందీ చిత్రం రాత్ ఔర్ దిన్ రీమేక్ లో నటించబోతుంది. ఈ చిత్రంలో డ్యూయల్ రోల్ పోషిస్తోన్న ఐష్ అత్యధిక కాల్ షీట్స్ ఈ చిత్రానికి కేటాయించటంతో పాటు ఈ చిత్రీకరణ పూర్తయ్యే వరకు ఇతర చిత్రాలు అంగీకరించని ఒప్పందం ఉండటంతో ఈ చిత్రానికి ఏకంగా పది కోట్ల రూపాయలు పారితోషికం అందుకుంటోందట

Similar News