పాపం పృథ్వి కదా!

Update: 2018-04-03 07:41 GMT

రామ్ చరణ్ రంగస్థలం ఇండస్ట్రీ రికార్డులు క్రియేట్ చెయ్యడానికి తహతహ లాడుతుంది. విడుదలైనప్పటినుండి పాజిటివ్ అండ్ హిట్ టాక్ తో దూసుకుపోతున్న రంగస్థలం సినిమా నిడివి 2.50 నిముషాలు ఉన్నప్పటికీ పెద్దగా బోర్ ఫీల్ కావడం లేదు. ఫస్ట్ హాఫ్ లో చిట్టిబాబు చేసిన కామెడీ అండ్ నటన, రామలక్ష్మిలా సమంత హావభావాలు, అనసూయ రంగమ్మత్తగా ఇలా ఆకట్టుకోగా.... సెకండ్ హాఫ్ లో కొంచెం లాగింగ్ సీన్స్ ఉన్నప్పటికీ సినిమా మీద ఉన్న పాజిటివ్ టాక్ తో ప్రేక్షకుడు బోర్ ఫీల్ కావడం లేదు. కానీ సినిమా విడుదలకు ముందు 2.50 నిమిషం నిడివి అంటే అందరూ బాబోయ్ అన్నారు. అంతసేపు థియేటర్స్ లో కూర్చుని ఏం చేస్తాం అన్నట్టుగా మాట్లాడారు. కానీ ఈ సినిమా కి ఇంకా రన్ టైం 2.50 నిమిషాల కన్నా ఎక్కువేనంట.

మరి అంత నిడివి ఉంటె సినిమా టాక్ నెగెటివ్ గా వస్తుందని భావించిన రంగస్థలం టీమ్ సినిమాలోని కొన్ని సన్నివేశాలను ఎడిటింగ్ లో లేపేసారట. మరీ మూడు గంటలు మించి సినిమా నిడివి ఎక్కువైతే కష్టమని భావించిన టీమ్ ఇలా చేసిందని ఫిలిం నగర్ టాక్. అయితే అలా కత్తిరించిన సీన్స్ లో కమెడియన్ పృద్వికి సంబందించిన సీన్స్ ఎక్కువగా ఉన్నాయట. అసలు సినిమా సెకండాఫ్ లో డ్రామాతో సంబంధం లేకుండా పృథ్వీ .. రామ్ చరణ్ కాంబినేషన్లో చిన్నపాటి కామెడీ ట్రాక్ ను చిత్రీకరించారట. అయితే ఈ కామెడీ ట్రాక్ వలన సినిమా నిడివి మరింత పెరగడంతో పృద్వి కామెడీ ట్రాక్ ని పూర్తిగా తీసేశారట.

మరి ఆ ట్రాక్ వలన అసలు రంగస్థలం అసలు కథకు మోసం వస్తుందని గ్రహించిన సుకుమార్ అండ్ టీమ్ పృద్వి కామెడీ ని లేపేసారనే టాక్ వినబడుతుంది. మరి పృద్వి కామెడీ రంగస్థలంలో లేపేసిన న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా చక్కర్లు కొడుతోంది. 30 ఇయర్స్ ఇండస్ట్రీ అంటూ ఒక్కసారిగా లైం లైట్ లోకొచ్చిన ఈ కమెడియన్ కి ఒక పెద్ద సినిమాలో ఇలా జరగడం కాస్త బాధాకర మైన విషయమే.. కానీ ఏం చేస్తాం పృద్వి బ్యాడ్ లక్ అది.

Similar News