పాపం ఇష్టమైంది తింటే హాస్పిటల్ కి వెళ్లాల్సి వచ్చిందట!!

Update: 2017-01-24 12:50 GMT

టాలీవుడ్ ఎంట్రీనే పవన్ కళ్యాణ్ వంటి స్టార్ హీరో పక్కన జోడిగా అదిరిపోయే ఎంట్రీ ఇచ్చిన నికిషా పటేల్ టాలీవుడ్ లో మాత్రం నిలదొక్కుకోలేకపోయింది. ఏదో అడపాదడపా తెలుగులో కనిపిస్తూ అటు తమిళంలో కూడా బండి లాగించేస్తుంది ఈ అమ్మడు. తాజాగా నికిషా, పూరీ జగన్నాథ్ తమ్ముడు సాయి రామ్ శంకర్ హీరోగా వచ్చిన 'అరకు రోడ్' లో నటించింది. ఇక ఆ సినిమా ఆశించిన ఫలితం ఇవ్వలేదు. ఇప్పుడు నికిషా గురించి ఇదంతా ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే నికిషా తిన్న ఒక ఆహార పదార్ధం వల్ల హాస్పిటల్ పాలవ్వాల్సి వచ్చిందని చెబుతుంది. అది రోడ్ సైడ్ న అమ్మబడే పానీపూరి వల్ల నికిషా హాస్పిటల్ కి వెళ్లాల్సి వచ్చిందట. నికిషా స్వతహాగా తిండిపోతునని చెప్పుకుంటూ ఉంటుంది. అలంటి నికిషా కి పానీపూరి అంటే ప్రాణమట, ఆ ప్రాణమే ఇప్పుడు ప్రాణాల మీదకి తెచ్చిందని వాపోతుంది.

రోడ్ పక్కన పానీపూరి కనబడగానే కారాపి తినడం వలన ఫుడ్ ఫాయిజన్ అవడంతో హాస్పిటల్ బెడ్ ఎక్కాల్సి వచ్చిందని తెగ బాధ పడిపోతుంది. అందుకే పానీపూరీ ని బ్యాన్ చెయ్యాలని నినదిస్తుంది. ఇక పానీపూరి జోలికి ఇంకెప్పుడు వెళ్లనని వెళితే ఒట్టు అంటుంది. అసలది తింటే ఆరోగ్యం పాడవుతుందని.... దానిని ఇండియాలో బ్యాన్ చెయ్యాలని చెబుతోంది. పాపం దానిబారిన పడి ఎంత బాధపడకపోతే ఇంతలా చెబుతుంది నికిషా...!

Similar News