పవన్, బాలయ్యలకు కంగారు పుట్టిస్తున్న నిర్మాత?

Update: 2017-11-27 08:04 GMT

పవన్ కళ్యాణ్ అజ్ఞాతవాసి జనవరి 10 న, బాలకృష్ణ - ఏ ఎస్ రవికుమార్ ల జై సింహ జనవరి 12 న సంక్రాతి కానుకగా విడుదలవుతున్న సంగతి తెలిసిందే. అలాగే సంక్రాతి బరిలో ఒక తమిళ సినిమా అభిమన్యుడు, ఇంకా రెండు చిన్న సినిమాలు ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇకపోతే ఇప్పుడు సంక్రాతి బరిలో మరో గట్టి సినిమా రాబోతున్నట్టుగా తెలుస్తుంది. దిల్ రాజు - వేణు శ్రీరామ్ - నాని కలయికలో తెరకెక్కుతున్న మిడిల్ క్లాస్ అబ్బాయి MCA కూడా సంక్రాతి బరిలోకి వచ్చేసినట్టుగా చెబుతున్నారు.

అసలయితే నాని చెప్పినట్టుగా MCA సినిమా డిసెంబర్ 21 న విడుదల కావాల్సి ఉంది. కానీ కొన్ని కారణాల వలన సినిమా పోస్ట్ పోన్ అయ్యిందనే టాక్ మొదలయ్యింది. నాని - దిల్ రాజుల సినిమాని సంక్రాంతికే తేవాలని అనుకుంటున్నట్లుగా చెబుతున్నారు. మరి దిల్ రాజు సినిమా వస్తుంది అంటే... మిగతా విడుదలయ్యే సినిమాలకు కాస్త దడగానే ఉంటుంది. ఎందుకంటే దిల్ రాజు బ్యానర్ లో వచ్చే సినిమాలన్నీ సక్సెస్ సాధిస్తాయి. అలాగే దిల్ రాజు గతంలోనూ చిరు, బాలయ్యలతో శతమానం భవతి తో ఢీకొట్టి హిట్ కొట్టాడు. అందుకే సంక్రాతి సీజన్ కే దిల్ రాజు మొగ్గుచూపుతున్నట్లుగా తెలుస్తుంది.

ఇక దిల్ రాజు సంక్రాతి బరిలో MCA ని దింపుతున్నాడనగానే.. అటు అజ్ఞాతవాసి శిబిరం, ఇటు జై సింహ శిబిరాల్లో కంగారు మొదలయ్యిందంటున్నారు. మరి నాని వరుస హిట్స్ తో దూసుకుపోతూ తన నుండి వచ్చే సినిమాల మీద మంచి అంచనాలు పెంచేస్తున్నాడు. మరోవైపు సక్సెస్ ఫుల్ నిర్మాత దిల్ రాజు నిర్మాతగా సినిమా వస్తుంది అన్నా అంతే. మరి ఇప్పుడు బాలయ్య, పవన్ లు దిల్ రాజుని చూసి భయపడేటట్టే ఉన్నారంటున్నారు. చూద్దాం దిల్ రాజు వైపు నుండి ఈ విషయం అధికారికంగా బయటికి వచ్చేవరకు ఈ విషయంపై ఎలాంటి క్లారిటీ ఉండదు.

Similar News