పవన్ క్లారిటీ ఇవ్వు?

Update: 2017-12-04 11:00 GMT

పవన్ కళ్యాణ్ - త్రివిక్రమ్ కలయికలో వస్తున్న అజ్ఞాతవాసి చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుని... ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా వుంది. ఈ సినిమా కి సంబందించిన ప్యాచ్ వర్క్ తోపాటు... పవన్ కళ్యాణ్ పాత్రకు కూడా డబ్బింగ్ చెప్పెయ్యబోతున్నాడు. ఇక అజ్ఞాతవాసి తర్వాత అందరూ పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో బిజీగా వుంటాడని ఊహించారు. అలా ఊహించినట్టుగానే పవన్ కళ్యాణ్ పాద యాత్ర తెరమీదకి వచ్చింది. ఇంకేమిటి వైసిపి నేత జగన్ కి పోటీగా పవన్ కళ్యాణ్ ఏపీలో పాద యాత్ర చేపడుతున్నాడని అన్నారు.ఇక అది కూడా అజ్ఞాతవాసి షూటింగ్ కంప్లీట్ కాగానే పవన్ పాద యాత్రకి వెళతాడన్నారు.

కానీ ఇప్పుడు అజ్ఞాతవాసి పూర్తిఅవ్వడం తోనే... కొన్ని ప్రమోషనల్ కార్యక్రమాల్లో పాల్గొనే పవన్ కళ్యణ్ వెంటనే నేసన్ దర్శకత్వంలో ఎ. ఎం. రత్నం నిర్మణంలో వేదలమ్ రీమేక్ షూటింగ్ తో సెట్స్ మీదకి వెళతాడని ప్రచారం జరుగుతుంది.ప్రస్తుతం నేసన్ స్క్రిప్ట్ వర్క్ తోపాటు.... నటీనటుల ఎంపిక చేపడుతున్నట్లుగా టాక్. అయితే ఈ సినిమాని దాదాపు మూడు నెలల్లోనే ఫినిష్ చేసి పవన్ కళ్యాణ్ పాద యాత్ర మొదలెడతాడని ఆయన సన్నిహితులు చెబుతున్నమాట. మరోపక్క అజ్ఞాతవాసి జనవరి 10 న విడుదలకాబోతుంది.

అందుకే జనవరి నెలాఖరు నుండి పవన్ పాద యాత్ర అంటూనే.. దానికి సంబందించిన రూట్ మ్యాప్ కూడా సిద్దమవుతుందనే టాక్ వినబడుతుంది. మరి దీనిబట్టి పవన్ ఫ్యాన్స్ తోపాటు.. జనసేన కార్యకర్తలు కూడా పాదయాత్ర ముందా? లేకుంటే.. వేదలమ్ రీమేక్ ముందా? అనే కంఫ్యూషన్ లో కొట్టుకుంటున్నారు.

Similar News