పది రోజుల తరువాత ఒక చిన్న పిల్లోడికి దొరికిపోయాడు

Update: 2017-03-10 06:54 GMT

బొంబాయి లో నిత్యం రద్దీగా వుండే లోకల్ ట్రైన్స్ లో ఒక బాలీవుడ్ సెలబ్రిటీ గత పది రోజులుగా ప్రతి రోజు ప్రయాణం చేస్తున్నాడు. కానీ అతనిని ఎవరూ గుర్తు పట్టలేకపోయారు. కానీ పదవ రోజు తన తిరుగు ప్రయాణంలో జనాల రద్దీ తక్కువగా వున్నా సమయంలో ఒక పసి పిల్లడు అతడిని గుర్తించాడట. ఆ సెలబ్రిటీ ఎవరంటే బాలీవుడ్ స్టార్ యాక్టర్ జాకీ ష్రాఫ్ నట వారసుడు టైగర్ ష్రాఫ్.

ప్రస్తుతం మున్నా మైకేల్ అనే హిందీ చిత్రంలో నటిస్తున్న టైగర్ ష్రాఫ్ ఆ చిత్రానికి సంబంధించిన యాక్షన్ సీక్వెన్సెస్ బొంబాయి లోని వాసాయి వద్ద జాతీయ రహదారి పై చిత్రీకరణ జరుపుకుంటుండటంతో బొంబాయి ట్రాఫిక్ లో సతమతమవకుండా లోకల్ ట్రైన్ లో మొఖానికి పేస్ మాస్క్ తగిలించుకుని ప్రతి రోజు షూటింగ్ కి హాజరై తిరిగి లోకల్ ట్రైన్ లోనే ఇంటికి వెళ్తున్నాడట. పది రోజులు ఇలానే ప్రయాణించాక ఒక రోజు చిత్రీకరణ ముగించుకుని తిరిగి ఇంటికి వెళ్తున్నప్పుడు పేస్ మాస్క్ ధరించి ఉన్నప్పటికీ ఒక పసి పిల్లాడికి దొరికిపోయానంటూ తన అనుభవాన్ని తెలిపాడు టైగర్ ష్రాఫ్.

ట్రైన్లో జనాల రద్దీ తక్కువగా ఉండటంతో కాసేపు పేస్ మాస్క్ తొలగించి ఆ పిల్లాడితో కబుర్లు చెప్తూ తన తిరుగు ప్రయాణాన్ని ఎంజాయ్ చేశానని తన లోకల్ ట్రైన్ ప్రయాణ వివరాలు తెలిపాడు టైగర్ ష్రాఫ్.

Similar News