నేటి నుంచి మోస్ట్ అవైటెడ్ ఫిలిం షూటింగ్

Update: 2017-01-30 22:30 GMT

గత కొంత కాలంగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ చేయబోతున్న పీరియాడిక్ లవ్ జోనర్ సినిమా గురించి అభిమానులలో ఎక్కువగా చర్చ నడుస్తుంది. ముందుగా డిసెంబర్ నెలలో చిత్రీకరణ ప్రారంభం అవుతుంది అని రామ్ చరణ్ అనౌన్స్ చేసినప్పటికీ ధ్రువ చిత్ర విడుదల మరియు ఖైదీ నెం. 150 నిర్మాణాంతర కార్యక్రమాలు, ప్రమోషనల్ ఈవెంట్స్ తో బిజీగా గడిపిన రామ్ చరణ్ తేజ్ సంక్రాంతి పండుగకి ఖైదీ నెం.150 విడుదల చేసి నిర్మాతగా తన తొలి ప్రయత్నాన్ని విజయవంతం చేసుకుని ఇప్పుడు ఆ సినిమా నుంచి ఫ్రీ అయ్యాడు. ఇప్పటికే ఖైదీ నెం.150 విడుదల అనంతరం ఇచ్చిన పలు ఇంటర్వ్యూలలో బాగా గడ్డం పెంచి కనిపించిన రామ్ చరణ్ తేజ్ సుకుమార్ సినిమా లో కనిపించబోయే లుక్ కోసమే సన్నద్ధమవుతున్నట్టు చెప్పాడు.

సినిమా షూటింగ్ ఎప్పుడు ప్రారంభం అవుతుందనేదాని పై ఇప్పటి వరకు స్పష్టత ఇవ్వలేదు రామ్ చరణ్. నేటి(సోమవారం) నుంచి చిత్రీకరణ ప్రారంభం అవుతుంది అని ఇప్పుడు తన పేస్ బుక్ ద్వారా వెల్లడించాడు రామ్ చరణ్. పల్లెటూరి ప్రేమ కథ గా తెరకెక్కనున్న ఈ చిత్రంలో చెర్రీ సరసన సమంత నటించనుంది. ఈ సినిమా కి సంబంధించి సుకుమార్ ప్రీ ప్రొడక్షన్ ని బాగా ప్లాన్ చేసి లొకేషన్స్ అన్ని ఇప్పుడే ఫిక్స్ చేసేసుకున్నాడని సమాచారం. సహజంగా సుకుమార్ దర్శకత్వం లో వచ్చిన సినిమాలన్నీ చిత్రీకరణ దశలో బాగా ఆలస్యం అయినవే. ఈ సారి ఆ ఆలస్యానికి తావివ్వకుండా జాగ్రత్తలు వహించి అన్నీ సిద్ధం చేసుకున్నాకే చిత్రీకరణ కి వెళ్తున్నామని రామ్ చరణ్ తెలిపారు. ఈ ఏడాది వేసవి సమయానికి చిత్రీకరణని పూర్తి చేయాలని టార్గెట్ గా దిగుతున్నారంట చిత్ర యూనిట్ సభ్యులు. మేకింగ్ వైస్ అసలు రాజి పడని సుక్కు ఈ చిత్రాన్ని ఎన్ని రోజులలో పూర్తి చేస్తాడో చూడాలి.

Similar News