నిఖిల్ రిజెక్ట్ చేసిన స్టోరీ ఓకే చేశాడా?

Update: 2017-12-31 11:00 GMT

చిరంజీవి చిన్నల్లుడు కళ్యాణ్ త్వరలో తెలుగు ఇండస్ట్రీ కి హీరోగా పరిచయం అవుతున్న సంగతి అందరికి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా పట్ల మెగా ఫ్యామిలీ ఎంతో శ్రద్ద తీసుకుంటుంది. అలా శ్రద్ధ వహించడం తో మేకర్స్ కూడా సినిమాని త్వరగా స్టార్ట్ చేయడానికి రంగం సిద్దం చేస్తున్నారు. ఇంతకుముందు జత కలిసే అనే సినిమా తీసిన రాకేశ్ శశి అనే యువ దర్శకుడు ఈ మూవీ ని డైరెక్ట్ చేయబోతున్నాడు. అయితే ఆ దర్శకుడు చెప్పిన కథ ముందు కళ్యాణ్ కు నచ్చగా.... ఆ తర్వాత చిరంజీవి కి కూడా స్టోరీ వినిపించి ఓకే చేసుకున్నట్లుగా చెబుతున్నారు.

అయితే ఈ సినిమా స్టోరి మొదటగా మెగా ఫ్యామిలీ చిన్నల్లుడు కళ్యాణ్ దగ్గరికి రాలేదట. దర్శకుడు రాకేశ్ శశి ముందుగా హీరో నిఖిల్ కి ఈ కథని చెప్పాడట. అయితే నిఖిల్ కి వేరే సినిమాల కమిట్మెంట్స్ ఉండటం వల్ల ఈ కథని రిజెక్ట్ చేసాడట. కట్ చేస్తే ఇప్పుడు ఆ కథ వెళ్లి ఇదిగో ఇలా మెగా కాంపౌండ్‌లో పడిందని ప్రచారం మొదలవుతుంది. సాయి కొర్రపాటి ప్రొడ్యూస్ చేస్తున్న ఈ సినిమా ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ దశలో ఉంది. మార్చి లేదా ఏప్రిల్ నుంచి ఈ సినిమా పట్టాలెక్కే ఛాన్స్ ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇకపోతే కళ్యాణ్ ప్రస్తుతం నటన, ఫైట్స్‌ లో శిక్షణ తీసుకుంటున్నాడు.

Similar News