నాని తదుపరి చిత్రం లో విలన్గా ఆది

Update: 2017-01-27 08:01 GMT

వచ్చే నెల 3 వ తేదీన నాచురల్ స్టార్ నాని నటించిన నేను లోకల్ చిత్రం విడుదల కానుండగా ఈ చిత్ర ప్రచారం లో భాగంగా వరుసగా ప్రెస్ మీట్లతో పాటు కథానాయిక కీర్తి లోకేష్ తో కలిసి పేస్ బుక్ ఆఫీస్ లోనూ సందడి చేసిన నాని మరో వైపు తన తదుపరి చిత్ర చిత్రీకరణికి సిద్దమైపోతున్నాడు. గ్యాప్ లేకుండా సినిమాలు చేస్తూ మినిమం గ్యారంటీ హీరోగా ముద్ర వేసుకున్న నాని తన తదుపరి చిత్రానికి గ్యాప్ తీసుకోకుండా ఫెబ్రవరి మొదటి వారంలోనే రెగ్యులర్ షూట్ లో పాల్గొననున్నాడు. నూతన దర్శకుడు శివ నిర్వానంద్ కి అవకాశం కలిపిస్తూ డి.వి.వి.దానయ్య నిర్మించ బోతున్న ఈ చిత్రానికి ఇంకా టైటిల్ ఖరారు చేయలేదు.

మూడు షెడ్యూల్స్ తో చిత్రీకరణ జరుపుకోనున్న ఈ చిత్రం తొలి షెడ్యూల్ పూర్తిగా అమెరికా లో జరగనుంది. గత ఏడాది జెంటిల్ మాన్ చిత్రంలో తొలి సారి నాని తో జత కట్టిన మళయాళ భామ నివేద థామస్ ఈ చిత్రంతో మరొక సారి నాని తో కలిసి కథానాయికగా నటించనుంది. తమిళ ప్రేక్షకులకు హీరోగా సుపరిచితుడైన ఆది పినిశెట్టి గత ఏడాది స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సినిమా తో ప్రతినాయకుడిగా కూడా బాగా గుర్తింపు సంపాదించాడు. ఇప్పుడు నాని నటించబోతున్న ఈ కొత్త చిత్రంలో కూడా ఆది పినిశెట్టికి ప్రతినాయకుడి పాత్రే దక్కింది. ఈ చిత్రానికి గోపి సుందర్ సంగీత దర్శకత్వం వహించనున్నారు.

Similar News