నాచురల్ స్టార్ కి అక్క గా ప్రముఖ కథానాయిక

Update: 2017-02-08 18:25 GMT

తెలుగు చిత్ర పరిశ్రమలో చిరంజీవి, వెంకటేష్, నాగార్జున, మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, తారక్, రవి తేజ వంటి అగ్ర కథానాయకుల సరసన కథానాయికగా నటించిన భూమిక చావ్లా వివాహం చేసుకున్న అనంతరం సినిమాల సంఖ్యను క్రమంగా తగ్గించారు. భూమిక చావ్లా తెలుగులో చివరగా 2014 లో లడ్డు బాబు చిత్రంలో కనిపించారు. తరువాత గత ఏడాది అంతర్జాతీయ క్రికెట్ క్రీడాకారుడు ఎమ్.ఎస్.ధోని ది అంటోల్డ్ స్టోరీ లో కథానాయకుడికి సోదరిగా నటించారు. ఆ చిత్రంలో తెలుగులోకి కూడా అనువదించబడి మంచి విజయం సాధించింది. దానితో 38 సంవత్సరాల వయసులో భూమిక కి తెలుగు లో పెద్ద నిర్మాణ సంస్థల నుంచి ఆఫర్లు వస్తున్నాయి. అయితే వస్తున్న అవకాశాలు కథానాయికగా కాదు. ఎమ్.ఎస్.ధోని ది అంటోల్డ్ స్టోరీ లో పోషించిన అక్క పాత్రల వలే కథానాయకుడి సోదరి పాత్రలు లభిస్తున్నాయి.

తాజాగా నాచురల్ స్టార్ నాని నటించిన నేను లోకల్ చిత్రం గ్రాండ్ సక్సెస్ కావటంతో విజయోత్సవాలలో మునిగి తేలుతున్న నాని తన తదుపరి చిత్రాలలో ఒకటి మరో సారి దిల్ రాజు నిర్మాణం లో చేయటానికి ఒప్పొందం కుదుర్చుకున్నాడు. ఈ చిత్రానికి ఓ మై ఫ్రెండ్ ఫేమ్ వేణు శ్రీ రామ్ దర్శకత్వం వహించబోతున్నారు. కథానాయకుడి అక్క పాత్రకి ఎక్కువ ప్రాధాన్యం వున్నా కథ కావటంతో వేణు శ్రీ రామ్, దిల్ రాజు లు నాని కి అక్కగా భూమిక చావ్లా ని సంప్రదింపగా కథ విన్న వెంటనే భూమిక గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిందట. మొత్తానికి ఈ తరానికి వెండితెరపై సరికొత్త సోదరి తెలుగు చిత్ర పరిశ్రమకి దొరికిందన్న మాట.

Similar News