"నన్నుదోచుకుందువ‌టే" అంటున్న సుధీర్ బాబు

Update: 2018-06-18 07:32 GMT

హృద‌యాన్ని హ‌త్తుకునేలా అభిమానుల్ని దృష్టిలో పెట్టుకుని మంచి క‌థ‌లు ఎంచుకుని హిట్స్ కొడుతున్న హీరోల్లో సుధీర్ బాబు ఒకర‌ని చెప్పాలి. సుధీర్ బాబు చేస్తున్న చిత్రాలు ట్రెండ్‌సెట్ట‌ర్ లుగా నిలిచిపోవటానికి కార‌ణం కూడా ఆయ‌న క‌థ‌ల సెల‌క్ష‌న్ అనే చెప్పాలి. రీసెంట్ గా ప్రేక్ష‌కుల‌, విమ‌ర్శ‌కుల ప్ర‌శంసలు పొందిన "స‌మ్మోహ‌నం" ఘ‌న‌విజ‌యం సాధించిన విష‌యం తెలిసిందే. ముఖ్యంగా స‌మ్మెహ‌నం లో సుధీర్‌బాబు న‌ట‌న గురించి ప్ర‌స్తావించని ప్రేక్ష‌కుడు లేడు. ఇలా విభిన్నమైన కథలతో, పాత్రలతో మెప్పిస్తున్న సుధీర్ బాబు ఇటీవలే తన సొంత నిర్మాణ సంస్థను సుధీర్ బాబు ప్రొడక్షన్స్ పేరిట‌ స్థాపించిన సంగతి తెలిసిందే. సుధీర్ బాబు ప్రొడక్షన్స్ లో నిర్మిస్తున్న తొలి చిత్రం షూటింగ్ 90 శాతం పూర్తయింది. ఆర్‌.ఎస్.నాయుడు ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. సుధీర్ బాబును విభిన్నమైన కోణంలో, కొత్త‌ స్క్రీన్ ప్లే, అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకునే కథ, మంచి నిర్మాణ విలువలతో ఈ చిత్రం రూపొందుతోంది. నతేశ్ ఈ చిత్రంతో హీరోయిన్ గా పరిచయం అవుతోంది. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ శరవేగంగా జరుగుతోంది. ఈ నెలాఖరులో ఫస్ట్ లుక్ రిలీజ్ చేయనున్నారు. త్వరలోనే రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తారు. ఈ చిత్రానికి "న‌న్నుదోచుకుందువ‌టే" టైటిల్ ని ఖ‌రారు చేశారు.

 

 

Similar News