నన్ను మోసం చేసారు

Update: 2018-04-01 11:02 GMT

హీరోగా... విలన్ గా..క్యారెక్టర్ ఆర్టిస్టుగా అన్ని రకాల పాత్రలు చేసి మనల్ని మెప్పించిన విలక్షణ నటుడు జగపతి బాబు. లేటెస్ట్ గా జగ్గు నటించిన రంగస్థలం సినిమా బాక్సాఫీసు వద్ద భారీ కలెక్షన్స్ తో దూసుకుపోతుంది. జగపతి బాబు ఇందులో విలన్ గా చేసి అందరి ప్రశంసలు పొందాడు. అయితే లేటెస్ట్ గా ఓ పత్రికకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

తానూ ఒక్కప్పుడు ఆర్థికంగా దెబ్బతిన్నానని, అందుకు తన అలవాట్లు మాత్రమే కారణం కాదని..తన దగ్గర నుండి డబ్బు తీసుకున్నవారు చాలా మంది తిరిగి ఇవ్వకుండా మోసం చేసారని చెప్పారు. ఈ విషయంలో తప్పు తనదేనని, తన వద్ద ఉన్న డబ్బంతా పోగొట్టుకున్నానని చెప్పారు. తానూ క్యాసినోలకు వెళ్లి జూదం ఆడటం వల్లే డబ్బును కోల్పోయినట్టు పలువురు భావిస్తున్నారని, అది అవాస్తవమని చెప్పారు.

గతంలో డబ్బు విలువ తెలియకుండా ఖర్చు చేశానని, ఇప్పుడు విలువ తెలుసుకుని ఖర్చు పెడుతున్నానని అన్నారు. అప్పుడు ఇబ్బందుల్లో పడటం మంచిదే అనుకుంటున్నానని ఆలా జరిగివుండకపోతే ఇప్పుడు నేను ఇలా మల్లి తిరిగి డబ్బు సంపాదించుకునేవాడిని కాదేమో అని అన్నారు. ఇక బాహుబలి సినిమాలో తాను పోషించదగ్గ పాత్ర లేదని రాజమౌళి భావించి ఉండవచ్చని, అందుకే తాను ఆ చిత్రంలో భాగం కాలేకపోయానని అన్నారు.

Similar News