దేవి డిమాండింగ్!

Update: 2018-02-06 05:57 GMT

ఒకప్పుడు టాలీవుడ్ లో మ్యూజిక్ డైరెక్టర్ దేవి శ్రీ ప్రసాద్ కాళీ లేకుండా సినిమాలు చేస్తూ వెళ్ళిపోయాడు. కానీ ఇప్పుడు ఆ స్తానం థమన్ తీసుకున్నాడు. ప్రస్తుతం దేవి శ్రీ ప్రసాద్ చేతిలో రామ్ చరణ్ హీరో గా వస్తున్నా సినిమా “రంగస్థలం”.

ఈ పెద్ద సినిమా తప్ప దేవి చేతిలో ఇంకేమి మూవీస్ లేవు. ఈ మూవీకి సంబంధించి దేవి ఆల్మోస్ట్ వర్క్ మొత్తం ఫినిష్ చేసాడు. ఈ నెల మూడో వారం నుండి ఈ సినిమా ప్రమోషన్స స్టార్ట్ చేసి ఆడియో లాంచ్ వేడుక జరుపుదాం అని మైత్రి మూవీ మేకర్స్ అనుకుంటున్నారు. ఆడియో లాంచ్ లో దేవి శ్రీ ప్రసాద్ తో లైవ్ పెర్ఫార్మన్స్ చేయించాలి అని కూడా ప్రొడ్యూసర్స్ అనుకున్నారట.

అయితే దేవి మాత్రం ఒక్క షరతు పెట్టాడు. ఆడియో లాంచ్ లో లైవ్ పెర్ఫార్మన్స్ చేయాలంటే దేవి పాతిక లక్షలు అడిగాడంట. దేవి ఆలా అనేసరికి “రంగస్థలం” మేకర్స్ కి ఎం చేయాలో అర్ధం కాక అయోమయంలో ఉన్నారట.

Similar News