దువ్వాడ కి కష్టాలు తప్పేలా లేవు..!

Update: 2017-06-18 11:30 GMT

దిల్‌రాజు హరీష్‌శంకర్‌ దర్శకత్వంలో అల్లుఅర్జున్‌ హీరోగా తెరకెక్కిస్తున్న 'డిజె' చిత్రం రేపు రాబోయే శుక్రవారం విడుదలకు సిద్దమవుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం తెలుగులో టాప్‌రేపనుందని అందరూ భావిస్తున్నా కూడా ఉత్తరాదితో పాటు తమిళనాడు, కర్ణాటక మరీ ముఖ్యంగా బెంగుళూరులో మాత్రం తిప్పలు తప్పేట్లు లేవు. బాలీవుడ్‌ మూవీ అందునా సల్మాన్‌ఖాన్‌ నటిస్తున్న భారీ ప్రతిష్టాత్మక చిత్రం 'ట్యూబ్‌లైట్‌'ని భారీగా విడుదల చేయనుండటం వల్ల ఉత్తరాదితో పాటు చెన్నై, బెంగుళూరు వంటి చోట్ల 'డిజె'కు అనుకున్న స్థాయిలో థియేటర్లు దొరికేట్లు లేవు.

మరోపక్క అదేరోజున తమిళంలో హీరో శింబు చిత్రంతో పాటు జయం రవి నటించనున్న చిత్రాలు విడుదల కానుండటంతో తమిళనాడుతో పాటు బెంగుళూరులో 'ట్యూబ్‌లైట్‌'తో పాటు ఈ రెండు చిత్రాలు కూడా పెద్దఎత్తున రిలీజ్‌ కానుండటం విశేషం. ఇక బన్నీకి మంచి క్రేజ్‌ ఉన్న మలయాళంలో ఈ చిత్రాన్ని ఆలస్యంగా విడుదల చేయాలని నిర్ణయించారు.

ఇక దిల్‌రాజు 'డిజె' విడుదలకు ముందే హరీష్‌శంకర్‌, పూజా హెగ్డేల తో అప్పటి డిమాండ్‌ని బట్టి కాకుండా 'డిజె'కి సరిసమానమైన పారితోషికంతోనే వారితో మరో చిత్రానికి అగ్రిమెంట్‌ చేసుకున్నాడని సమాచారం. కాగా ఇప్పటికే దిల్‌రాజు 'డిజె' తర్వాత మరో చిత్రాన్ని హరీష్‌శంకర్‌తో చేస్తానని ముందే అనౌన్స్‌ చేసిన సంగతి తెలిసిందే.

Similar News