దిల్ రాజు మరో హీరో ని లైన్ లో పెట్టాడా?

Update: 2017-10-29 08:54 GMT

ఎవరితో సంబంధం లేకుండా వరస పెట్టి సినిమాలు తీసుకుంటూ వెళ్ళిపోడం దిల్ రాజుకి అలవాటే. కనీసం ఏడాదికి అరడజను సినిమాలు తీయటమే టార్గెట్ గా దిల్ రాజు పెట్టుకున్నట్టు తెలుస్తుంది. చిన్న హీరోస్ నుండి పెద్ద హీరోస్ దాక ఎవరిని వదిలి పెట్టకుండా సినిమాలు తీస్తుంటాడు. అందుకేనేమో థియేటర్లలు చాలా వరకు ఖాళీగా ఉండవ్. అందుకే మంచి సినిమాలు తీసి మంచి వ్యాపారం చేస్తుంటాడు.

అయితే ప్రస్తుతం దిల్ రాజు నిర్మాణంలో నాని హీరోగా 'ఎంసిఏ' సినిమా సెట్స్ మీద వుంది. అయితే లేటెస్ట్ గా రాజ్ తరుణ్ హీరోగా 'లవర్స్' సినిమాకు కొబ్బరికాయ కోట్టారు. అంతేకాకుండా దిల్ రాజు... హీరో నిఖిల్ తో ఒక సినిమా ఓకే చేసిన్నట్టు తెలుస్తుంది. ఇప్పుడు హీరో రామ్ తో కూడా ఒక సినిమా చేయాలనీ దిల్ రాజు భావిస్తున్నాడట. 'సినిమా చూపిస్త మావా', 'నేను లోకల్' వంటి సినిమాలు అందించిన నక్కిన త్రినాధరావు డైరక్షన్ లో దిల్ రాజు నిర్మాణంలో హీరో రామ్ సినిమా చేయబోతున్నట్లు తెలుస్తోంది. దాదాపుగా ఈ సినిమాని కన్ఫర్మ్ చేసినట్టు తెలుస్తుంది.

రామ్ - కిషోర్ తిరుమల కలయికలో వచ్చిన 'ఉన్నది ఒకటే జిందగీ' యావరేజ్ టాక్ తేపించుకుంది. అయితే రామ్ ఇప్పటివరకు క్లాస్ సినిమాలు తీసుకుంటూ వచ్చాడు. కానీ నక్కిన త్రినాధరావు సినిమా స్టయిల్ కాస్త మాస్ తో కూడుకుని ఉంటుంది. మరి రామ్ త్రినాధ్ రావు దర్శకత్వంలో సినిమా చెయ్యడం అంటే రామ్ కి కాస్త ఛేంజ్ ఓవర్ గానే వుంటుంది. పైగా దిల్ రాజు ప్రొడ్యూసర్ కాబట్టి కథ విషయంలో చాలా జాగ్రత్తలు పాటించే అవకాశం వుంది.

Similar News