దిల్ రాజు మరో హిట్ కాంబినేషన్ ని సెట్ చేస్తున్నాడు

Update: 2017-10-20 14:09 GMT

టాలీవుడ్ నిర్మాతలంతా ఒక ఎత్తు అయితే దిల్ రాజు మాత్రమే ఒక ఎత్తు. దిల్ రాజు నుండి సినిమా తెరకెక్కుతుంది అంటేనే ఆ సినిమాకి ఎక్కడలేని అంచనాలు మొదలైపోతాయి. దిల్ రాజుకి కథ నచ్చింది అంటే చిన్న లేదూ... పెద్ద లేదు ఏ హీరో తో అయినా సినిమాని నిర్మించేస్తాడు. అలా కాబట్టే చేసిన ప్రతి సినిమాతోనూ హిట్ అందుకుంటూ సక్సెస్ ఫుల్ నిర్మతగా టాలీవుడ్ లో చక్రం తిప్పుతున్నాడు. చిన్న సినిమాలతో పాటే పెద్ద సినిమాలను నిర్మిస్తూ స్టార్ హీరోలను కూడా వదలడు. తాజాగా తమిళనాట కూడా అడుగుపెట్టడానికి రెడీ అయ్యాడు.

కమల్ హాసన్ హీరోగా శంకర్ దర్శకత్వంలో ఒక భారీ అంటే 200 కోట్ల భారీ బడ్జెట్ సినిమాని తెరకెక్కించడానికి సంసిద్ధమవుతున్నాడు. ఇండియన్ 2 సినిమాని తెరకెక్కించే ప్రయత్నాల్లో ఉన్న దిల్ రాజు ఇప్పుడు మరో హిట్ కాంబినేషన్ తో కూడా సినిమాని నిర్మించేందుకు రెడీ అవుతున్నాడు. గతంలో హీరో నిఖిల్ - దర్శకుడు చందు మొండేటి కలయికలో వచ్చిన కార్తికేయ సినిమా ఏ స్థాయిలో విజయాన్ని అందుకుందో తెలిసిన విషయమే. ఇప్పుడు మరోసారి దిల్ రాజు ఆ హిట్ కాంబినేషన్ తో సినిమాని నిర్మించడానికి రెడీ అవుతున్నాడు.

మరి చందు మొండేటి ప్రస్తుతానికి నాగ చైతన్య తో సవ్యసాచి సినిమాని తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా త్వరలోనే సెట్స్ మీదకెళ్లాల్సి ఉంది. మరొకవైపు నిఖిల్ కూడా కిరాక్ పార్టీ రీమేక్ లో బిజీగా వున్నాడు. ఇక చందు సవ్యసాచితో... నిఖిల్ కిరాక్ పార్టీ రీమేక్ సినిమాల పూర్తయ్యేసరికి కొద్దిగా టైం పడుతుంది. ఈ గ్యాప్ లో దిల్ రాజు ఇండియన్ 2 మీద తన దృష్ణి పెట్టి.. ఆతర్వాత నిఖిల్ - చందుల సినిమా నిర్మాణాన్ని మొదలుపెడతాడట.

Similar News