దిల్ రాజు బ్యానర్ల లో చాన్నాళ్లకు నితిన్?

Update: 2017-11-14 17:00 GMT

స్టార్ రైటర్ సతీష్ వేగేశ్న 2008లో ‘దొంగల బండి’ చిత్రంతో దర్శకుడయ్యాడు. ఆ చిత్రం అంతగా ఆకట్టుకోలేకపోయింది. ఆ తరువాత తీసిన ‘రామదండు’ చిత్రం కూడా అట్టర్ ప్లాప్ అయ్యింది. అయినా కూడా దిల్ రాజు అతడు చెప్పిన కథ మీద నమ్మకంతో ‘శతమానం భవతి’ అప్పగించాడు. ఈ సంవత్సరం సంక్రాంతి కానుకగా విడుదలైన ఆ చిత్రం దిల్ రాజుకు ఏకంగా జాతీయ అవార్డు సాధించిపెట్టింది. ఆ చిత్రం ఇచ్చిన హిట్ తో మరోమారు దిల్ రాజు - సతీష్ వేగేశ్న లు కలవబోతున్నారు.

శ్రీనివాస కల్యాణం....

వీరి కలయికలో తెరకెక్కబోతున్న ఆ చిత్రానికి ‘శ్రీనివాస కళ్యాణం’ అనే టైటిల్ ని కూడా రిజిస్టర్ చేయించాడు. ఫామిలీ బ్యాక్ డ్రాప్ తో తెరకెక్కబోతున్న ఈ చిత్రంలో కథానాయకుడిగా నితిన్ ఎంపికైనట్టు సమాచారం. ఈ విషయం పై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. నితిన్ ఈ సంవత్సరం ‘లై’ చిత్రంతో వచ్చినా ఆ చిత్రం అంతగా ఆకట్టుకోలేకపోయింది. నితిన్ ప్రస్తుతం ‘దిల్ వాలా’ చిత్రంలో నటిస్తున్నాడు. కృష్ణ చైతన్య ఆ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా.. పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ పతాకం పై పవన్ కళ్యాణ్ ఆ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. ఆ చిత్రం తరువాత నితిన్ ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో నటించనున్నాడు. మరి దిల్ రాజు బ్యానర్ లో గతంలో ఎప్పుడో.. దిల్ లో నటించిన నితిన్ ఇప్పుడు మళ్ళీ ఇన్నాళ్లకు రాజుగారి బ్యానర్ లో నటించబోతున్నాడు.

Similar News