దిల్ రాజు పిచ్చి పీక్స్ లో ఉంది!!

దిల్ రాజు ఇప్పుడు కొత్త పెళ్ళికొడుకు. తన మొదటి భర్య అనిత మరణంతో ఒంటరితనం ఫిలయిన దిల్ రాజు తాజాగా రెండో పెళ్లి చేసుకున్నాడు.  అయితే దిల్ [more]

Update: 2020-05-29 09:50 GMT

దిల్ రాజు ఇప్పుడు కొత్త పెళ్ళికొడుకు. తన మొదటి భర్య అనిత మరణంతో ఒంటరితనం ఫిలయిన దిల్ రాజు తాజాగా రెండో పెళ్లి చేసుకున్నాడు.  అయితే దిల్ రాజు బడా నిర్మాత అయినప్పటికీ.. డైరెక్ట్ సినిమాల కన్నా ఎక్కువగా ఈ మధ్యన రీమేక్ సినిమాలకే మొగ్గు చూపుతున్నాడు. ఇప్పటికే జానూ సినిమా చేసి బొక్క బోర్లా పడిన దిల్ రాజు పవన్ కళ్యాణ్ తో పింక్ రీమేక్ చేస్తున్నాడు. పవన్ రీ ఎంట్రీ మూవీ గనక అది కాస్త క్రేజ్ ఉంది. కానీ పింక్ సినిమాని చాలామంది ఇప్పటికే చూసేసారు. కాబట్టి జానూ లాంటి ఫలితం వకీల్ సాబ్ కి తప్పేలా లేదు. మరోపక్క దిల్ రాజు బాలీవుడ్ కి కూడా రీమేక్ తోనే ఎంట్రీ ఇస్తున్నాడు.

అది కూడా తెలుగులో హిట్ అయిన జెర్సీని బాలీవుడ్ లో షాహిద్ కపూర్ హీరోగా కరణ్ జోహార్ తో కలిసి నిర్మిస్తున్నాడు. బాలీవుడ్ కి క్రికెట్ అంటే ఉన్న పిచ్చిని దిల్ రాజు క్యాష్ చేసుకోవాలనుకున్నాడు. అయితే అది అలా ఉంటే.. ఇప్పుడు మరో రెండు మూవీస్ ని బాలీవుడ్ లో రీమేక్ చేసే యోచనలో దిల్ రాజు ఉన్నాడట. ఇప్పటికే ఎఫ్ 2 ని బాలీవుడ్ రీమేక్ చేసే ప్రయత్నాల్లో ఉన్న దిల్ రాజు ఇప్పుడు నాని హిట్ ని బాలీవుడ్ లో రీమేక్ చెయ్యాలని భావిస్తున్నాడట. హిట్ సినిమా ఫిబ్రవరిలో విడుదలై హిట్ టాక్ తెచ్చుకున్నప్పటికీ.. డబ్బులు అంతగా రాలేదు. కానీ అమెజాన్ ప్రైమ్ లో మాత్రం హిట్ హిట్ అయ్యింది. సో ఈ సినిమాని కూడా దిల్ రాజు రీమేక్ అంటున్నాడట. అది చూసిన జనాలు దిల్ రాజు పిచ్చి పీక్స్ లో ఉందిగా అంటున్నారట. 

Tags:    

Similar News